ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను గట్టెక్కించడం కోసం ఆ దేశ నూతన ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం.. అప్పులను తీర్చడం కోసం జాతీయ విమానయాన సంస్థను ప్రయివేట్పరం చేయాలని భావిస్తోంది. 2021 మార్చి చివరి నాటికి శ్రీలంక ఎయిర్లైన్కు 370 బిలియన్ రూపాయల మేర నష్టాలున్నాయని ప్రధాని రణిల్ విక్రమ సింఘే తెలిపారు. ఎయిర్లైన్స్ను ప్రయివేటీకరించిన తర్వాత కూడా నష్టాలను భరించాల్సి ఉంటుందన్న విక్రమసింఘే.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా విమానం ఎక్కని నిరుపేదలు ఈ నష్టాలను భరించాల్సి ఉంటుందన్నారు. 2015 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న విక్రమసింఘే ఎయిర్లైన్స్ను ప్రయివేటీకరించలేకపోయారు. 1975లో ఏర్పాటైన శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లోని 126 ప్రదేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 2010లో శ్రీలంక ప్రభుత్వం దుబాయ్కు చెందిన ఎమిరేట్స్ నుంచి శ్రీలంకన్ ఎయిర్లైన్స్లో వాటాను తిరిగి దక్కించుకుంది. శ్రీలంకన్ ఎయిర్లైన్స్లో 25 ఎయిర్బస్ ఎస్ఈ విమానాలు ఉన్నాయి. 2006 తర్వాత తొలిసారి ఓ త్రైమాసికంలో లాభాలు వచ్చాయని గత నెలలో శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ 1.7 మిలియన్ డాలర్ల నికరాదాయం వచ్చిందని తెలిపింది.
ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో శ్రీలంక లేకపోవడంతో.. జీతాలిచ్చేందుకు నగదును ముద్రించాలని విక్రమసింఘే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో శ్రీలంక కరెన్సీపై ఒత్తిడి పడే ప్రమాదం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ముందు మరో దారి లేకపోయింది. శ్రీలకంలో ప్రస్తుతం ఒక్క రోజుకు సరిపడా మాత్రమే గ్యాసోలిన్ నిల్వలు ఉన్నాయి. ఓపెన్ మార్కెట్లో డాలర్లను పొందడం ద్వారా క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి తమ జలాల్లో వేచి ఉన్న మూడు నౌకలకు చెల్లింపులు చేయాలని లంక సర్కారు భావిస్తోంది.
వచ్చే కొద్ది నెలల సమయం మన జీవితంలో అత్యంత కఠినమైందని శ్రీలంక ప్ధాని విక్రమసింఘే తెలిపారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం నూతన జాతీయ అసెంబ్లీ లేదా అన్ని రాజకీయ పక్షాల భాగస్వామ్యంతో పొలిటికల్ బాడీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
అధ్యక్షుడు గొటబయ రాజపక్ష ప్రవేశపెట్టిన డెవలప్మెంట్ బడ్జెట్ స్థానంలో రిలీఫ్ బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రీమియర్ హామీ ఇచ్చారు. గొటబయ బడ్జెట్ కారణంగానే శ్రీలంక ద్రవ్యోల్బణ రేటు వేగంగా పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి బడ్జెట్ లోటు జీడీపీలో 13 శాతం ఉండొచ్చని విక్రమసింఘే అంచనా వేశారు.
గతవారం రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేపట్టగా.. ప్రభుత్వ మద్దతుదారులు వారిపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల అనంతరం మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. ఐఎంఎఫ్తో బెయిలవుట్ చర్చల కోసం కొత్త ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిని ఇంకా నియమించలేదు.
చైనా, భారత్ నుంచి రుణాలు పొందాలని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. కానీ పూర్తి కేబినెట్ లేకుండా ఈ ప్రక్రియను ఎలా చేపడతారనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది.
ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో శ్రీలంక లేకపోవడంతో.. జీతాలిచ్చేందుకు నగదును ముద్రించాలని విక్రమసింఘే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో శ్రీలంక కరెన్సీపై ఒత్తిడి పడే ప్రమాదం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ముందు మరో దారి లేకపోయింది. శ్రీలకంలో ప్రస్తుతం ఒక్క రోజుకు సరిపడా మాత్రమే గ్యాసోలిన్ నిల్వలు ఉన్నాయి. ఓపెన్ మార్కెట్లో డాలర్లను పొందడం ద్వారా క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి తమ జలాల్లో వేచి ఉన్న మూడు నౌకలకు చెల్లింపులు చేయాలని లంక సర్కారు భావిస్తోంది.
వచ్చే కొద్ది నెలల సమయం మన జీవితంలో అత్యంత కఠినమైందని శ్రీలంక ప్ధాని విక్రమసింఘే తెలిపారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం నూతన జాతీయ అసెంబ్లీ లేదా అన్ని రాజకీయ పక్షాల భాగస్వామ్యంతో పొలిటికల్ బాడీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
అధ్యక్షుడు గొటబయ రాజపక్ష ప్రవేశపెట్టిన డెవలప్మెంట్ బడ్జెట్ స్థానంలో రిలీఫ్ బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రీమియర్ హామీ ఇచ్చారు. గొటబయ బడ్జెట్ కారణంగానే శ్రీలంక ద్రవ్యోల్బణ రేటు వేగంగా పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి బడ్జెట్ లోటు జీడీపీలో 13 శాతం ఉండొచ్చని విక్రమసింఘే అంచనా వేశారు.
గతవారం రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేపట్టగా.. ప్రభుత్వ మద్దతుదారులు వారిపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల అనంతరం మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. ఐఎంఎఫ్తో బెయిలవుట్ చర్చల కోసం కొత్త ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిని ఇంకా నియమించలేదు.
చైనా, భారత్ నుంచి రుణాలు పొందాలని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. కానీ పూర్తి కేబినెట్ లేకుండా ఈ ప్రక్రియను ఎలా చేపడతారనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది.