యాప్నగరం

Rajapaksa రాజీనామా.. సంక్షోభం ముగిసినట్టేనా?

శ్రీలంక ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్సే తప్పుకున్నారు. ఆయన స్థానంలో రాణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టనున్నారు.

Samayam Telugu 15 Dec 2018, 12:22 pm
శ్రీలంక ప్రధాని పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రాణిల్ విక్రమ సింఘే ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు. అక్టోబర్ 26న విక్రమ సింఘేను ప్రధాని బాధ్యతల నుంచి తప్పించిన అధ్యక్షుడు సిరిసేన.. ఆ పదవిలో రాజపక్సేను కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది. పార్లమెంట్‌లో బలం నిరూపించుకోవడానికి కూడా విక్రమ సింఘేకు అవకాశం ఇవ్వలేదు. దీంతో శ్రీలంకలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. వివాదం ముదరడంతో రాజపక్సే సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
Samayam Telugu rajapaksa


దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధాని పదవి నుంచి రాజపక్సే వైదొలగాల్సి వచ్చింది. రాజపక్సేను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడం కోసం అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అనైతికంగా వ్యవహరించారు. విక్రమ సింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించారు.

తనపై వేటు వేయడాన్ని విక్రమ సింఘే అంగీకరించలేదు. పార్లమెంట్‌లో బలం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని అధ్యక్షుడిని కోరారు. కానీ సిరిసేన మాత్రం అందుకు అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్‌ను కూడా రద్దు చేశారు. ఇంటా బయటా ఒత్తిడి అధికం కావడంతో.. రాజపక్సే రాజీనామా చేశారు. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం దాదాపు ముగిసిందని భావించొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.