యాప్నగరం

శ్రీదేవి పార్థీవ దేహం తరలింపు ఆలస్యం.. బయల్దేరేది సోమవారమే!

దుబాయ్ నుంచి శ్రీదేవి పార్థీవ దేహం తరలింపు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. సోమవారమే ఆమె భౌతిక కాయాన్ని అక్కడి నుంచి పంపే అవకాశం ఉంది.

TNN 25 Feb 2018, 9:40 pm
దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి భౌతిక కాయం తరలింపు ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి 8 గంటలకు ఆమె పార్థీవ దేహం ముంబై చేరుకుంటుందని భావించినప్పటికీ.. సోమవారమే దుబాయ్ నుంచి బయల్దేరనున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి మరణానికి సంబంధించిన తుది విచారణ నివేదికల్ని దుబాయ్ పోలీసులు ఆదివారం సాయంత్రానికి సిద్ధం చేయలేదు. లీగల్ ఫార్మాలిటీస్‌ పూర్తి కాకపోవడం, డెత్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో ఈ రోజు ఆమె మృతదేహాన్ని స్వదేశం పంపే అవకాశం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి.
Samayam Telugu sridevis body likely to be flown home on monday
శ్రీదేవి పార్థీవ దేహం తరలింపు ఆలస్యం.. బయల్దేరేది సోమవారమే!


సోమవారం అక్కడి ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే శ్రీదేవి భౌతిక కాయాన్ని ఇండియాకు పంపే వీలుంది. సాధ్యమైనంత త్వరగా శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించే విషయంలో బోనీ కపూర్ కుటుంబ సభ్యులకు ఇండియన్ కాన్సులేట్ అధికారులు సహకరిస్తున్నారు. దుబాయ్ పోలీసు అధికారులతో చర్చలు జరుపుతున్నామని యూఏఈలోని భారత రాయబారి నవ్‌దీప్ సింగ్ సూరీ ఆదివారం ఉదయం తెలిపారు.

అంబానీకి చెందిన 13 సీటర్ ప్రయివేట్ జెట్‌లో అతిలోక సుందరి పార్థీవ దేహాన్ని ఇండియాకు తీసుకు రానున్నారు. ఇప్పటికే ఆ ఎయిర్‌క్రాప్ట్ ముంబై నుంచి దుబాయ్ చేరుకుందని తెలుస్తోంది.

ఆదివారం సాయంత్రానికే పోస్ట్ మార్టమ్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాయి. కానీ తుది రిపోర్టులు బయటకు రాలేదని, అందుకు టైం పడుతుందని సాయంత్రం 4 గంటల 15 నిమిషాల సమయంలో అధికార వర్గాలు వెల్లడించాయి. పార్థీవ దేహం రాక ఆలస్యం అయితే.. అంత్యక్రియలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.