యాప్నగరం

ఓ నిరాశ్రయుడి చివరి కోరిక తీర్చిన స్టీవ్ వా

షూ పాలిష్ చేసుకొని జీవించిన ఓ వ్యక్తి చివరి కోరిక తీర్చేందుకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా వారణాసి వెళ్లాడు.

TNN 9 Mar 2017, 11:51 am
షూ పాలిష్ చేసుకొని జీవించిన ఓ వ్యక్తి చివరి కోరిక తీర్చేందుకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా వారణాసి వెళ్లాడు. సిడ్నీలో షూ పాలిష్ చేసుకొని జీవితాన్ని వెళ్లదీసిన బ్రెయిన్ రుడ్ రెండు నెలల క్రితం మరణించాడు. నిరాశ్రయుడైన అతడికి భారత్ సందర్శించాలనే కోరిక బలంగా ఉండేది. అది సాధ్యం కాకపోవడంతో.. కనీసం తన అస్థికలనైనా గంగా నదిలో కలపాలని అతడు కోరుకున్నాడు. గంగానదిలో అస్థికలు కలిపితే పునర్జన్మ ఉండదని హిందువులు విశ్వసిస్తారు. దీంతో బ్రెయిన్ తన అస్థికలను కూడా గంగా నదిలో కలపాలని కోరుకున్నాడు. అతడి చివరి కోరికను తీర్చడానికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ముందుకొచ్చాడు.
Samayam Telugu steve waugh in varanasi to scatter ashes of sydney based shoe shiner
ఓ నిరాశ్రయుడి చివరి కోరిక తీర్చిన స్టీవ్ వా


మంగళవారం వారణాసి చేరకుకున్న వా.. గైడ్ సహాయంతో దశాస్వమేద్ ఘాట్‌కు చేరుకొని బ్రెయిన్ అస్థికలను గంగలో నిమజ్జనం చేశాడు. 18 ఏళ్లపాటు సిడ్నీ వీధుల్లోనే జీవితం గడిపిన బ్రెయిన్ మూడు నెలల వయసులోనే కుటుంబానికి దూరమయ్యాడు. బాయ్స్ హోంలలో పెరిగిన అతడు.. అక్కడ తీవ్రంగా హింసకు గురయ్యాడు. దీంతో 12 ఏళ్ల వయసులోనే ఆత్మహత్యకు యత్నించాడు.


తన మంచితనంతో సిడ్నీ వాసుల మనసు గెల్చుకున్న ఓ మంచి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడానికి నేను, నా ఫౌండేషన్ కొద్దిపాటి సాయం చేశామని స్టీవ్ వా అనంతరం వ్యాఖ్యానించాడు. హిందు సంప్రదాయం ప్రకారం అస్థికలను నిమజ్జనం చేయడానికి నెల రోజుల ముందు నుంచే ప్రణాళిక వేసుకున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.