యాప్నగరం

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

New Zealand Eartquake: న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Samayam Telugu 5 Mar 2021, 8:33 pm
న్యూజిలాండ్ సమీపంలో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని న్యూజిలాండ్ అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం (మార్చి 5) వేకువజామున 3 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8.30 గంటలకు) భూకంపం వచ్చింది. న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Samayam Telugu న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ


తీర ప్రాంత ప్రజలకు సునామీ ముప్పు ఉందని న్యూజిలాండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతంలో ఇళ్లు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని, భూమి కోతకు గురి కావొచ్చునని తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

భూకంపం కారణంగా కారణంగా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇళ్లలోని వస్తువులు, సీలింగ్ ఫ్యాన్లు కదిలాయి. అందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ‘అందరూ సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నా..’ అని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పోస్టు చేశారు.


గిస్‌బోర్న్ నగరానికి సునామీ వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు న్యూజిలాండ్ అధికారులు తెలిపారు. 35,500 మంది జనాభా గల ఈ నగరాన్ని అప్రమత్తం చేశారు. తీర ప్రాంత ప్రజలను తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.