యాప్నగరం

సోమాలియా అధ్యక్ష భవనంపై ఉగ్రమూకల దాడి

ఏకంగా దేశ అధ్యక్షుడు హసన్ షేక్ మహబూబ్ ను టార్గెట్ చేసుకొని ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు.

TNN 30 Aug 2016, 6:01 pm
మోగదీషు: ఉగ్రమూకలు ఈ సారి ఏకంగా సోమాలియా అధ్యక్షుడినే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. అధ్యక్షుడి నివాసం వద్ద మంగళవారం ఆత్మాహుతి దళాలు తమను తాము పేల్చుకుని బీభత్సం సృష్టించారు. అదృష్టవశాత్తు అధ్యక్షుడు హసన్ షేక్ మహబూబ్ భవనం నుంచి ఆ సమయంలో బయటికి రాకపోవడంతో పెను ప్రమాదం నుంచి బయటపడినట్లయింది. కాగా ఈ దాడిలో భవనానికి సమీపంలో ఉన్న హోటల్ పాక్షికంగా దెబ్బతింది.
Samayam Telugu terror attack at mongolian president hall
సోమాలియా అధ్యక్ష భవనంపై ఉగ్రమూకల దాడి


పోలీసుల కథనం ప్రకారం ఉగ్రమూకలు అధ్యక్షుడినే టార్గెట్ చేసుకొని వచ్చారని.. అయితే భద్రతా సిబ్బంది సోదాల్లో పట్టుబడంతో వారు తొలుత తుపాకీలతో కాల్పులు జరిపి అక్కడిక్కడే ఆత్మాహుతికి పాల్పడినట్లు తెలిసింది. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అనుబంధ గ్రూప్ అయిన అల్- షబాబ్ కు చెందిన మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ఈ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో పలు సార్లు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఇటీవలే మోగదీష్ లో జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలసిందే. ఈ ఘటన నుంచి తేరుకోకముందే ఉగ్రమూకలు మరోసారి దాడికి పాల్పడటంతో స్థానికులు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.