యాప్నగరం

పొడవైన గాజు వంతెనపై మొదలైన నడక

చైనాలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన, ఎత్తైన గాజు వంతెన పున:ప్రారంభమైంది

TNN 2 Oct 2016, 11:50 am
చైనాలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన, ఎత్తైన గాజు వంతెన పున:ప్రారంభమైంది. చైనా రాజధాని బీజింగ్ లోని హునన్ ప్రావిన్స్ లో నిర్మించిన ఈ వంతెనను పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్మించారు. ఈయేడాది ఆగస్టులోనే ప్రారంభించిన ఈ గాజు వంతెన ట్రయల్ రన్...లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల 12రోజుల తర్వాత మూసివేశారు. ‘పర్యాటకులకు రక్షణ కల్పించాల్సి బాధ్యత మాపై ఉంది. సాంకేతికంగా తలెత్తిన లోపాలను గుర్తించేందుకే ఆగస్టులో ట్రయల్ వేశాం. అప్పుడు గుర్తించిన సమస్యలను అదిగమించాం.’ అని నిర్వహకులు చెబుతున్నారు. 430 మీటర్ల పొడవుతో ఉన్న గాజు వంతెనపై ఒకే సారి పదివేల మందిదాకా నడిచేలా ఏర్పాట్లు చేశారు. అంతమంది ఒకేసారి నడిచినా ఏలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు.
Samayam Telugu the longest glass bridge reopened in china
పొడవైన గాజు వంతెనపై మొదలైన నడక


హైమ్ దోటన్ అనే ఆర్కిటెక్ట్ ను దీన్ని రూపొందించారు. శనివారం ఉదయం పున:ప్రారంభమైన ఈ వంతెనపై తొలిరోజు 800మంది మాత్రమే వినియోగిచుకున్నారు. అధికారులు మాత్రం రోజులు 8000మంది దీనిపై నడిచేందుకు అనుమతిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.