యాప్నగరం

నేడు గోవా వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు

గోవా వేదికగా శనివారం నుంచి బ్రిక్స్ దేశాల సదస్సు ప్రారంభం కానుంది.

TNN 15 Oct 2016, 10:16 am
గోవా వేదికగా నేడు బ్రిక్స్ దేశాల సదస్సు ప్రారంభం కానునంది. ఈ సదస్సులో భారత్ తో పాటు చైనా, రష్యా, బ్రెజిల్,సౌతాఫ్రికా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ఆయా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు.. దానికి పరిష్కార మార్గాలపై దృష్టి సారించనున్నాయి. ఈ వేదికగా ఆర్థిక వృద్ధికి ఉగ్రవాదం పెనుముప్పుగా పరిగణిస్తోందని వాదిస్తూ పాక్ పై దౌత్య దాడి చేయాలని భారత్ భావిస్తోంది. ఉగ్రవాద నియంత్రణపై బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం విస్తరించుకోవాలని భారత్‌ కోరనుంది. ఇదిలా ఉండగా ఈ సద్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ శుక్రవారం రాత్రే గోవా చేసుకున్నారు
Samayam Telugu today brics summit 2016 in goa
నేడు గోవా వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు


బ్రిక్స్ సదస్సుకు ముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో పాక్ ఉగ్రవాదం గురించి లేవనెత్తి ... ఉగ్రవాదానికి ఆ దేశం ప్రొత్సహిస్తున్న తీరును వివరించనున్నారు. ఉగ్రమూకలకు ఆయుధ సంపత్తి అందజేస్తున్న పాక్ పై చర్యల తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ వివరించనున్నారు. దీనిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లు ఎలా స్పందిస్తారనే దానిపై సత్వత్రా ఉత్కంఠత నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.