యాప్నగరం

Pakistan: ఢీకొన్న బస్సు, ఆయిల్ ట్యాంకర్... 20 మంది సజీవ దహనం

పాకిస్థాన్‌లో (Pakistan) బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. దాంతో మంటలు చెలరేగి.. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కూడా కష్టమైంది. దీంతో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దాంతో డీఎన్‌ఏ చేసి కుటుంబీకులు అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 16 Aug 2022, 4:40 pm

ప్రధానాంశాలు:

  • పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
  • చనిపోయిన 20 మంది, ఆస్పత్రిలో ఆరుగురు
  • విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pakistan accident
పాకిస్థాన్‌లో (Pakistan) ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లో మంగళవారం ఓ ప్యాసింజర్ బస్‌ని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దాంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ముల్తాన్‌ హైవేకి సుమారు 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న లాహోర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అనంతరం కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
"లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న బస్సు.. ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో 20 మంది చనిపోయారు. మంటలు చెలరేగి బస్సు, ట్యాంకర్‌లు కాలిపోయాయి. ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు." అని స్థానిక అధికారి వెల్లడించారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ మేరకు ఆరుగురు ప్రయాణికులు ముల్తాన్‌లోని నిష్టర్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు.

అలాగే చనిపోయిన ప్రయాణికుల్లో చాలామంది మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయని, డీఎన్ఏ పరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అందజేస్తామని స్థానిక అధికారులు తెలిపారు. నిజానికి సహాయక చర్యలు చేయడం కూడా కష్టమైందని, మంటలను అదుపు చేయడం అగ్నిమాపక బృందాలకు చాలా కష్టమైందన్నారు.

ప్రమాద ఘటన విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత ఆరోగ్య అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను గుర్తించేందుకు అధికారులు సహకరించాలని సూచించారు. కాగా శనివారం కూడా ఇలాంటి ఓ ప్రమాదం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణికుల బస్సును ఓ ట్రక్కు ఢీ కొనడంతో కనీసం 13 మంది మరణించారు. అయితే పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు జరగడం సాధరణం అయిపోయింది. అస్తవ్యస్థమైన రహదారులు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే యాక్సిడెంట్లు తరచుగా జరుగుతుంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.