యాప్నగరం

Queen Elizabeth II: రూ.71 కోట్లతో రాణి అంత్యక్రియలు... శవపేటికపై 2,868 విలువైన వజ్రాలు

ఏడు దశాబ్దాలుగా తిరుగులేని రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ (Queen Elizabeth II) అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే వివిద దేశాల అధినేతలు బ్రిటన్‌కు చేరుకున్నారు. రాణి అంత్యక్రియల కోసం దాదాపుగా రూ.71 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంత్యక్రియలను లైవ్‌లో ప్రసారం చేయనున్నారు. రాచరికపు సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వందల ఏళ్ల నాటి ఆచార సంప్రదాయాలతో రాణికి సోమవారం వీడ్కోలు పలకనున్నారు. రాణికి నివాళులు అర్పించడానికి లక్షలాది మంది తరలి రానున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 18 Sep 2022, 11:13 pm

ప్రధానాంశాలు:

  • రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు సర్వం సిద్ధం
  • రాచరికపు సంప్రదాయాలతో అన్ని ఏర్పాట్లు
  • సోమవారం తుది వీడ్కోలు పలకనున్న బ్రిటన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Queen Elizabeth Funeral
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. రాచరికపు సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వందల ఏళ్ల నాటి ఆచార సంప్రదాయాలతో రాణికి సోమవారం వీడ్కోలు పలకనున్నారు. రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అక్కడకు చేరుకున్నారు. మన దేశం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు. ఇప్పటికే రాణి మృతదేహానికి నివాళులు అర్పించారు.
సర్వం సిద్ధం...
ఇప్పటికే రాణి మృతదేహాన్ని చూసేందుకు జనం కూడా తరలి వస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చొని రాణికి తుది నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంచిన రాణి శవపేటికను రాయల్ నేవికి చెందిన గన్ క్యారేజ్‌లో సోమవారం వెస్ట్ మినిస్టర్ అబేకు మారుస్తారు. ఉదయం 6 గంటల నుంచి సందర్శనార్థం పెడతారు. 11 గంటల నుంచి అంత్యక్రియల కార్యక్రమం మొదలవుతుంది. అక్కడ వెస్ట్‌మినిస్టర్ డీన్ డేవిడ్ హోయల్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరుగుతాయి.

బ్రిటన్ ప్రధాని ప్రసంగం...
అదేవిధంగా కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ జస్టిన్ వెల్బీ.. సంతాప ప్రసంగాన్ని ఇస్తారు. బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ కూడా ప్రసంగించే అవకాశం ఉంది. అనంతరం రాణి శవపేటికను వెస్ట్‌ మినిస్టర్ అబే నుంచి లండన్ హైడ్ పార్క్ కార్నర్‌లోని వెల్లింగ్టన్ ఆర్చ్‌కు తరలిస్తారు. అక్కడ నుంచి విండ్సర్స్ క్యాజిల్‌కు అంతిమ యాత్రగా తీసుకెళ్తారు. ఇందులో కింగ్‌ ఛార్లెస్‌-3తోపాటు రాజ కుటుంబం కూడా పాల్గొంటుంది. చివరిగా క్వీన్‌ ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ను ఉంచిన దగ్గరే రాణి శవపేటికను ఉంచుతారు. ఆ శవపేటికపై 2,868 విలువైన వజ్రాలు, నీలమణులు, మరకత మణులు, ముత్యాలు, రూబీలు పొదిగిన రాణి కిరీటాన్ని ఉంచారు.

ప్రత్యక్ష ప్రసారం...
రాణి అంత్యక్రియల సందర్భంగా బ్రిటన్‌లో సోమవారం సెలవు ప్రకటించారు. 125 సినిమా థియేటర్లలో రాణి అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అంతేకాదు పార్కులు, బహిరంగ స్థలాలలో కూడా ప్రదర్శించనున్నారు. రాణి అంత్యక్రియలకు 2000ల మంది ప్రముఖులు, అతిథులు హాజరు కానున్నారు. రాణి అంత్యక్రియల సందర్భంగా సుమారు పది లక్షల మంది ప్రజలు లండన్‌కు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా, ఈ మేరకు 25 అదనపు రైళ్లను నడిపిస్తున్నారు.

భారీ ఏర్పాట్లు...
ఇంత మంది జనాన్ని నియంత్రించేందుకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పదివేల మందికిపైగా పోలీస్ అధికారులు లండన్‌లో విధులు నిర్వర్తించనున్నారు. అంతేకాదు 36 కిలోమీటర్ల మేరకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్, వెస్ట్‌మినిస్టర్ అబే, బకింగ్‌హమ్ ప్యాలెజ్ పరిసరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. రాణిగారి అంత్యక్రియలకు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఏజే+ అనే వార్తా సంస్థ లెక్కల ప్రకారం బ్రిటన్ సుమారు రూ.71 కోట్లు వెచ్చించనుంది.

రాణి ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8వ తేదీన కన్నుమూశారు. 70 ఏళ్ల పాటు ఆమె నిర్విరామంగా బ్రిటన్‌ను పరిపాలించారు. 96మ ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.

Read Also:అభినవ దాన కర్ణుడు... రూ.24 వేల కోట్లు దానం చేసిన వ్యాపారవేత్త
Read Also:బాప్‌రే.. మహిళ పొత్తి కడుపులో బ్యాటరీలు.. ఏకంగా 55

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.