యాప్నగరం

Rishi Sunak విదేశీ విద్యార్థులకు చెక్‌.. ఆంక్షల విధించేందుకు సిద్ధమైన సునాక్?

Rishi Sunak వీసా పరిమితి దాటిన తర్వాతా బ్రిటన్‌లో నివసించే వారిలో అత్యధికులు భారతీయులే ఉంటున్నారని యూకే హోంమంత్రి, భారతీయ మూలాలున్న సుయెల్లా బ్రేవర్మన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ పార్టనర్‌షిప్‌(ఎంఎంపీ) ఆశించిన రీతిలో పనిచేయడం లేదని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తాజాగా, బ్రిటన్ ప్రధాని సైతం విదేశీ విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 27 Nov 2022, 8:23 am

ప్రధానాంశాలు:

  • బ్రిటన్‌కు క్యూ కడుతున్న విదేశీ విద్యార్థులు
  • గతేడాది కంటే రెండు రెట్లు అధికంగా వలస
  • నాసిరకం డిగ్రీలకు అడ్డుకట్ట వేసే చర్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rishi Sunak
Rishi Sunak ఏటా రెట్టింపు వేగంతో పెరిగిపోతున్న వలసలు ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు సంబంధించి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాన మంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారని, విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గించడం సహా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నారని యూకే ప్రధాని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నాసిరకం డిగ్రీలు, తమపై ఆధారపడేవారిని వెంట తెచ్చుకోవడం సహా పలు చర్యలకూ అడ్డుకట్ట వేసేందుకు పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
గతేడాది బ్రిటన్‌కు 1,73,000 మంది వలసరాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ 5,04,000 మంది వచ్చినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెల్లడించింది. ఏడాదిలోనే వలసల సంఖ్య 3.31 లక్షలు పెరిగిపోవడంపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. చైనాను అధిగమించి తొలిసారిగా ఈ ఏడాది భారత విద్యార్థులు అత్యధిక సంఖ్యలో బ్రిటన్‌ వచ్చారు. యూకే విశ్వవిద్యాలయాలు తమ సొంత విద్యార్థుల నుంచి తక్కువ ఫీజు వసూలు చేస్తాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోడానికి అధిక మొత్తంలో విదేశీ విద్యార్థుల నుంచి ఫీజును వసూలు చేసి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఒకవేళ, విదేశీ విద్యార్థులపై పరిమితులు విధిస్తే కొన్ని యూనివర్సిటీలు దివాళా తీసే ప్రమాదం కూడా ఉందని బీబీసీ కథనం తెలిపింది.

విదేశీ విద్యార్థులు తమ స్టూడెంట్ వీసాలోకి కుటుంబ సభ్యులను తీసుకురావడం, నాసిరకం కోర్సులను ప్రోత్సహించడం గురించి ఇటీవల యూకే హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రావెర్‌మాన్ ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఛాన్సలర్ జెరెమీ హంట్ గత వారం వృద్ధిని పెంచడానికి ఇమ్మిగ్రేషన్ అవసరమని నొక్కి చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించని విధంగా వలసలను తగ్గించాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని అన్నారు.

కాగా, వలసదారుల గణాంకాల నుంచి విదేశీ విద్యార్థులను తొలగించాలని ఎన్‌ఐఎస్‌ఏయూ (నేషనల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ అండ్‌ అలుమ్ని) అధ్యక్షుడు సనం అరోరా డిమాండ్‌ చేశారు. ఉన్నతకు విద్యకు నిధుల లేమి, దేశంలోని నైపుణ్యాల కొరత కారణంగా అంతర్జాతీయ విద్యార్థులు చదువుకోవడాన్ని ప్రభుత్వం కష్టతరం చేస్తే అంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదన్నారు. అధిక రుసుములు, కఠినమైన వీసా విధానాల ద్వారా విదేశీ విద్యార్థులను దోపిడీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.