ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నన్న కరోనా వైరస్ను ఉగ్రవాదులు కొత్త అస్త్రంగా మలుచుకునే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై కరోనా ప్రభావాన్ని ఇప్పటికిప్పుడే అంచనా వేయడం సాధ్యం కాకపోయినప్పటికీ.. దీన్ని అవకాశం తీసుకునేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయన్న విషయం సుస్పష్టం అని వ్యాఖ్యానించారు. కానీ, ప్రజల మధ్య విభజన, ప్రాంతీయ అస్థిరత, పాలనలో వైఫల్యాలు, ఇతర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, దుశ్చర్యలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కొవిడ్-19 సంక్షోభాన్ని ఓ అస్త్రంగా మార్చుకునే ప్రమాదం ఉందని గుటెరస్ హెచ్చరించారు.
ఒకప్పుడు సిరియా, ఇరాక్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఐసిస్.. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని మరోసారి తన పట్టుకోసం యత్నింస్తోందని వ్యాఖ్యానించారు. ఐరాస ఉగ్రవాద నిరోధక వారోత్సవాల్ని ప్రారంభించిన అనంతరం.. ఆన్లైన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే డిజిటల్ సాంకేతికత దుర్వినియోగం, సైబర్ దాడులు, బయో-ఉగ్రవాదం వంటి కొత్తతరం ముప్పుపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ సంక్షోభం నొక్కి చెప్పిందని గుటెరస్ తెలిపారు. ప్రత్యర్థి దేశాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఇప్పటికే ఉగ్రమూకలు దీన్ని అస్త్రంగా మార్చుకున్నాయనడానికి ఆధారాలున్నాయన్నారు. అందులో భాగంగానే వివిధ దేశాలపై కుట్ర సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. యూరోపియన్ యూనియన్ రాయబారి జోసెఫ్ బోరెల్ మాట్లాడుతూ.. ఈ సంక్షోభంలో ఉగ్రవాద నిరోధానికి పొంచి ఉన్న సవాళ్లపై ప్రపంచదేశాలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
‘ఈ సంక్షోభం కొన్ని చోట్ల ఉగ్రవాద కార్యకలాపాలను తగ్గించడానికి దారితీసిందనేది నిజం.. ప్రధానంగా భద్రతా సేవలను సమీకరించడమే దీనికి కారణం.. కానీ ఇతర ప్రాంతాలలో ఉగ్రవాదం, దాని వల్ల ఇబ్బందులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి కరోనా సంక్షోభం కొత్త సవాల్గా నిలిచిందని అమెరికా రాయబారి రిచర్డ్ హాస్ తెలిపారు. ఇది బహుశా ఎక్కువ దేశాలు బలహీనంగా లేదా విఫలమయ్యే వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు. దీని కారణంగా ఉగ్రవాద సంస్థల్లో నియామకాలు చాలా వరకు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోడానికి లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షల వల్ల ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు తాత్కాలికంగా తక్కువ సంఖ్యలో సాగుతున్నాయి.. కానీ, ఇదే సమయంలో ఐఎస్ సహ పలు ఉగ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి వర్చువల్ ప్లాట్ఫారమ్ను వాడుకుంటున్నాయని ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ ఉగ్రవాద నిరోధక కమిటీ ఛైర్మన్, ట్యూనిషియా ప్రతినిధి కైస్ కాబ్టానీ అన్నారు.
ఒకప్పుడు సిరియా, ఇరాక్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఐసిస్.. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని మరోసారి తన పట్టుకోసం యత్నింస్తోందని వ్యాఖ్యానించారు. ఐరాస ఉగ్రవాద నిరోధక వారోత్సవాల్ని ప్రారంభించిన అనంతరం.. ఆన్లైన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే డిజిటల్ సాంకేతికత దుర్వినియోగం, సైబర్ దాడులు, బయో-ఉగ్రవాదం వంటి కొత్తతరం ముప్పుపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ సంక్షోభం నొక్కి చెప్పిందని గుటెరస్ తెలిపారు. ప్రత్యర్థి దేశాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఇప్పటికే ఉగ్రమూకలు దీన్ని అస్త్రంగా మార్చుకున్నాయనడానికి ఆధారాలున్నాయన్నారు. అందులో భాగంగానే వివిధ దేశాలపై కుట్ర సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. యూరోపియన్ యూనియన్ రాయబారి జోసెఫ్ బోరెల్ మాట్లాడుతూ.. ఈ సంక్షోభంలో ఉగ్రవాద నిరోధానికి పొంచి ఉన్న సవాళ్లపై ప్రపంచదేశాలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
‘ఈ సంక్షోభం కొన్ని చోట్ల ఉగ్రవాద కార్యకలాపాలను తగ్గించడానికి దారితీసిందనేది నిజం.. ప్రధానంగా భద్రతా సేవలను సమీకరించడమే దీనికి కారణం.. కానీ ఇతర ప్రాంతాలలో ఉగ్రవాదం, దాని వల్ల ఇబ్బందులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి కరోనా సంక్షోభం కొత్త సవాల్గా నిలిచిందని అమెరికా రాయబారి రిచర్డ్ హాస్ తెలిపారు. ఇది బహుశా ఎక్కువ దేశాలు బలహీనంగా లేదా విఫలమయ్యే వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు. దీని కారణంగా ఉగ్రవాద సంస్థల్లో నియామకాలు చాలా వరకు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోడానికి లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షల వల్ల ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు తాత్కాలికంగా తక్కువ సంఖ్యలో సాగుతున్నాయి.. కానీ, ఇదే సమయంలో ఐఎస్ సహ పలు ఉగ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి వర్చువల్ ప్లాట్ఫారమ్ను వాడుకుంటున్నాయని ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ ఉగ్రవాద నిరోధక కమిటీ ఛైర్మన్, ట్యూనిషియా ప్రతినిధి కైస్ కాబ్టానీ అన్నారు.