యాప్నగరం

నీ రుణం వద్దు.. చైనాకు పాక్ ఝలక్!

మిత్ర దేశమంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగే చైనాకు పాకిస్థాన్ ఝలక్ ఇచ్చింది. డ్రాగన్ నిజస్వరూపం చూసిన పాక్ దిమ్మతిరిగింది.

TNN 16 Nov 2017, 1:03 pm
మిత్ర దేశం చైనాకు పాకిస్థాన్ ఝలక్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాయాది దేశం డియామర్ భాషా పేరిట ఓ డ్యామ్‌ను నిర్మిస్తోంది. దీని నిర్మాణానికి అయ్యే 14 బిలియన్ డాలర్లు రుణాన్ని మంజూరు చేయడానికి చైనా ముందుకొచ్చింది. కానీ కఠిన నిబంధనలు విధించింది. ప్రాజెక్ట్ మొత్తం చైనా గుప్పిట్లో ఉండేలా ఉన్న నిబంధనలు చూసి పాక్‌కు చిర్రెత్తుకొచ్చింది. వాస్తవానికి 60 బిలియన్ డాలర్ల వ్యయం చేపడుతున్న చైనా పాక్ ఆర్థిక కారిడార్‌లో ఈ ప్రాజెక్ట్ కూడా భాగం. చైనా ఉద్దేశాలు అర్థమైన పాక్.. సీపీఈసీ నుంచి ఈ ప్రాజెక్ట్‌ను మినహాయించాలని కోరింది.
Samayam Telugu unhappy with strict conditions pakistan rejects beijing aid for 14 billion pok dam
నీ రుణం వద్దు.. చైనాకు పాక్ ఝలక్!


పీఓకేలో సింధు నదిపై పాక్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు‌పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో వివాదాస్పదమైన ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ముందుకు రావడం లేదు. ఇదే అదనుగా చైనా కఠినమైన నిబంధనలు విధించింది. డ్రాగన్ తీరుతో అవాక్కైన పాకిస్థాన్.. సొంత నిధులతోనే డ్యామ్ నిర్మాణానికి సిద్ధపడుతోంది.

4500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన, భారీ నీటి నిల్వ సామర్థ్యం లక్ష్యాలుగా పాకిస్థాన్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఇది తమ నీటి అవసరాల్ని గణనీయంగా తీర్చగలదని నమ్మకంతో పాక్ నమ్మకంతో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.