యాప్నగరం

భారత్‌కు అమెరికా వెన్ను దన్ను: వైట్ హౌజ్

తీవ్రవాదం నుంచి తనను తాను కాపాడుకునే హక్కు ఇండియాకు ఉందని అమెరికా స్పష్టం చేసింది.

Samayam Telugu 13 Oct 2016, 3:07 pm
తీవ్రవాదం నుంచి తనను తాను కాపాడుకునే హక్కు ఇండియాకు ఉందని అమెరికా స్పష్టం చేసింది. ఉరీ ఘటన ముమ్మాటికీ ఉగ్రవాదమేనని శ్వేత సౌధం పునరుద్ఘాటించింది. ఈ యేడాది చివరికల్లా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో ఇండియాను భాగస్వామిగా చేసేందుకు తమవంతుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైట్ హౌజ్ లోని దక్షిణాసియా సంబంధాలు పర్యవేక్షణాధికారి పీటర్ లేవాయ్ అన్నారు.
Samayam Telugu uri attack was clear case of cross border terrorism white house
భారత్‌కు అమెరికా వెన్ను దన్ను: వైట్ హౌజ్


అమెరికా-ఇండియా సంబంధాలను ‘మోస్ట్ డైనామిక్ రిలేషన్స్’గా ఆయన అభివర్ణించారు.

‘ఉరీ ఘటన క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని స్పష్టపరుస్తోంది. తీవ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉరీ ఘటన భయంకరమైంది. ప్రతిదేశానికి తనను తాను రక్షించుకునే హక్కుంది. అయితే అణ్వాయుధాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని’ ఆయన అన్నారు.

ఉరీ ఘటన తర్వాత ఇండియా-పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు దిగజారిపోయాయని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

పాకిస్థాన్ కశ్మీర్ సమస్యను అప్ఘానిస్థాన్ తో ముడిపెట్టడం తాము అంగీకరించబోమని లేవాయ్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.