యాప్నగరం

రిసెర్చ్ పేరుతో అమెరికాలోకి చైనా సైనిక గూఢచారులు.. ముగ్గుర్ని అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ

అమెరికా, చైనాల మధ్య గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తికి చైనా వైఖరే కారణమని దుయ్యబడుతోన్న అగ్రరాజ్యం.. ఆ దేశంపై చర్యలకు ప్రయత్నిస్తోంది.

Samayam Telugu 24 Jul 2020, 12:20 pm
పరిశోధనల పేరుతో అమెరికాలోని ప్రవేశించి గూఢచర్యానికి పాల్పుడుతున్న చైనా మిలటరీ అధికారి సహా ముగ్గుర్ని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది. వీసా మోసం కేసులో ముగ్గురు చైనా పౌరులను అరెస్టు చేయగా, శాన్‌ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌లో ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు అమెరికా న్యాయ శాఖ గురువారం తెలిపింది. చైనా సైన్యం తన గూఢచారులను పంపిందనే అనుమానంతో అమెరికాలోని మొత్తం 25 నగరాల్లో వీసాదారులను ఎఫ్‌బీఐ విచారించినట్టు పేర్కొంది. 40 ఏళ్లకు పైగా సాగుతోన్న చైనా-యుఎస్ సంబంధాలలో ఇది కీలక పరిణామని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Samayam Telugu అమెరికాలో చైనా గూఢచర్యం
FBI Arrested Chinese


Read Also: దేశంలో మరింత ఉద్ధృతంగా కరోనా వైరస్.. మరో రికార్డు భారత్ సొంతం
టెక్సాస్, హ్యూస్టన్‌లోని చైనా కాన్సులేట్స్‌ను శుక్రవారం నాటికి మూసివేయాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశించడంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది. సైబర్ ఆపరేషన్లు, కుట్రల ద్వారా తమ సాంకేతి పరిజ్ఞ‌ానం, సైనిక రహస్యాలు సహ కీలక విషయాలను తస్కరించడానికి ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించింది. అయితే, అగ్రరాజ్యం ఆరోపణలను చైనా తోసిపుచ్చింది.

Read Also: రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: హైకోర్టులో సచిన్ వర్గానికి ఊరట
మొత్తం 25 నగరాల్లో అనుమానిత వీసాదారులను ఎఫ్‌బీఐ ఇంటర్వ్యూ చేసిందని న్యాయశాఖ వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన వీరు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి అమెరికాలో పరిశోధనలు పేరుతో వీసా పొందారని అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ డెమెర్స్ అన్నారు. అమెరికాలోని సమాజాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, విద్యాసంస్థలను దోపిడీ చేయడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో ఇది మరో భాగం అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై చైనా రాయబార కార్యాలయం తక్షణమే స్పందించడానికి నిరాకరించింది.

Read Also: కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ సంచలన నిర్ణయం.. ఐసీజే తీర్పు అమలుకు ప్రయత్నం!
ఎఫ్‌బీఐ డెరెక్టర్ క్రిస్టోఫర్ గత నెలలో మాట్లాడుతూ.. బ్యూరో నిర్వహిస్తున్న దాదాపు 5,000 కౌంటర్ ఇంటెలిజెన్స్ పరిశోధనలలో సగం చైనాకు సంబంధించినవేనని వ్యాఖ్యానించారు. రెండు దేశాలూ 1979లో దౌత్య సంబంధాల స్థాపన ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి మేధో సంపత్తి దొంగతనంపై అమెరికా ఛేధించిన అతిపెద్ద ఆపరేషన్ ఇదే అని నిపుణులు పేర్కొన్నారు.

Read Also: ఆగస్టు 15 వేడుకల నిర్వహణపై మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం

ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసివారిలో కేన్సర్‌పై పరిశోధనలు పేరుతో అమెరికాలోకి ప్రవేశించి, గూడచర్యం నిర్వహిస్తున్న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అధికారి తంగ్ జువాన్‌ ఉన్నట్టు తేలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.