యాప్నగరం

China: లక్షల్లో టిబెటన్ల డీఎన్‌ఏలను బలవంతంగా సేకరిస్తోన్న చైనా.. ప్రపంచం ఆందోళన

China: టిటెబ్ 13వ శతాబ్దం మధ్య కాలం నుంచీ తమ దేశంలో భాగంగా ఉందని చైనా వాదిస్తోంది. కానీ టిబెటన్లు మాత్రం తాము ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉన్నామని, తమపై చైనా అధికారం నిరంతరంగా లేదని అంటారు. యువాన్ రాజవంశాన్ని స్థాపించి.. తన రాజ్యాన్ని టిబెట్‌తో పాటు, చైనా, వియత్నాం, కొరియా వరకూ విస్తరించాడు. తర్వాత 17వ శతాబ్దంలో చైనా చింగ్ రాజవంశానికి టిబెట్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 15 May 2023, 11:34 am

ప్రధానాంశాలు:

  • స్వయంపాలిత టిబెట్‌లో చైనా దురాగతాలు
  • పౌరుల నుంచి బలవంతంగా డీఎన్ఏ సేకరణ
  • మానవహక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu DNA
ప్రపంచ పైకప్పుగా గుర్తింపు పొందిన టిబెట్‌ (Tibet) స్వయంప్రతిపత్తి ప్రాంతం. ఈ ప్రాంతంపై తమకు సర్వాధికారాలు ఉన్నాయని చైనా (China) వాదిస్తోంది. అంతేకాదు, 1951లో వేలాది మంది సైనికులను పంపి టిబెట్‌ను ఆక్రమించుకుంది. దశాబ్దాలుగా దురాగతాలను సాగిస్తోన్న చైనా.. టిబెట్‌ పౌరుల నుంచి బలవంతంగా డీఎన్‌ఏ నమూనాలను (DNA Samples) సేకరిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది నమూనాలను సేకరించినట్లు తెలుస్తోంది. టిబెట్‌ పౌరులను నియంత్రించడం, వారిని పర్యవేక్షణ కోసమే డ్రాగన్ ఇటువంటి చర్యలకు తెగబడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా, ఈ అంశంపై అమెరికా విదేశాంగశాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టిబెట్‌ స్వతంత్ర ప్రాంతం (TAR)లో ఆరేళ్ల వ్యవధిలో సుమారు 9.2లక్షల నుంచి 12లక్షల మంది పౌరుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను చైనా పోలీసులు సేకరించినట్లు గతేడాది సెప్టెంబరులో సిటిజెన్‌ ల్యాబ్‌ నివేదిక వెల్లడించింది. అక్కడ మూడో వంతు ప్రజల నుంచి డీఎన్ఏ నమూనా సేకరించినట్లు అంచనా. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల అనుమతి లేకుండా టిబెట్‌ పౌరుల డీఎన్‌ఏలను ఒక క్రమపద్ధతిలో సేకరిస్తున్నట్లు హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (HRW) నివేదిక ఇటీవల తెలిపింది.

రెండు రోజుల కిందట జరిగిన వార్షిక ఫ్రీడమ్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌ మాట్లాడుతూ.. ‘భారీ స్థాయిలో టిబెట్‌ పౌరుల డీఎన్‌ఏలను చైనా సేకరిస్తోందని నివేదికలు అందుతున్నాయి. అక్కడి పౌరులపై నియంత్రణ, పర్యవేక్షణ కోసమే చైనా ఈ తరహా చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మానవ జన్యు సమాచారం సేకరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పారు. మరోవైపు, బ్లింకెన్‌ వ్యాఖ్యలను అంతర్జాతీయ టిబెట్‌ ప్రచార సంస్థ (ICT) స్వాగతించింది.

‘క్రూరమైన ఆక్రమణలో భాగంగా టిబెట్‌ను సామాజిక నియంత్రణ పద్ధతులకు ప్రయోగశాలగా ఉపయోగించుకుంది. ఇందులో సామూహిక డీఎన్ఏ సేకరణ ఈ భయంకరమైన ప్రచారం ఉంది’ అని ఐసీటీ వ్యాఖ్యానించింది. ‘టిబెట్‌, అక్కడ పౌరులను చైనా నిరంకుశ పాలన నుంచి రక్షించడానికి ఉత్తమ మార్గం అక్రమ ఆక్రమణకు శాంతియుత పరిష్కారం కోసం ఒత్తిడి చేయడం.. ప్రస్తుతం ఉన్న టిబెట్-చైనా సంఘర్షణ చట్టానికి ద్వైపాక్షిక తీర్మానాన్ని అమెరికా కాంగ్రెస్ ఉభయసభలు ఆమోదించడం ద్వారా నెరవేర్చగలదు’ అని పేర్కొంది.

Read More Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.