యాప్నగరం

సలాహుద్దీన్‌ అంతర్జాతీయ తీవ్రవాది: అమెరికా

కశ్మీర్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా అమెరికా సోమవారం ప్రకటించింది.

TNN 27 Jun 2017, 9:25 am
కశ్మీర్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా అమెరికా సోమవారం ప్రకటించింది. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ సమావేశానికి కొన్ని గంటల ముందు యూఎస్ విదేశీ వ్యవహారాల ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ చర్య నేపథ్యంలో సలాహుద్దీన్‌తో అమెరికా పౌరులెవరూ లావాదేవీలు జరపడం నేరం. అమెరికా పరిధిలోని సలాహుద్దీన్ సంపదపైనా ఆంక్షలు ఉంటాయి. సయ్యద్ సలాహుద్దీన్ అలియాస్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ షా ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడని అందుకే అతణ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణిస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ తమ ప్రకటనలో పేర్కొంది.
Samayam Telugu us designates syed salahuddin global terrorist sets tone for trump modi meet
సలాహుద్దీన్‌ అంతర్జాతీయ తీవ్రవాది: అమెరికా


అమెరికా చర్యను భారత్ స్వాగతించింది. అమెరికా అధ్యక్షపీఠాన్ని ట్రంప్ అధిరోహించిన తరవాత ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఆయన దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్‌తో కలసి పనిచేయాలని ట్రంప్ నిర్ణయించారు. అందుకే కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని బలంగా వినిపిస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి దాడులకు దిగుతున్న హిజ్బుల్ ముజాహిదీన్ అమెరికా కన్నేసింది. ఈ చర్యతో పాకిస్థాన్‌కు గట్టి దెబ్బతగిలినట్లే. ఉగ్రవాదులుగా, ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ముద్రవేసిన వ్యక్తులు, సంస్థలు ఏకాకి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థను వారు ఏ విధంగానూ వినియోగించుకోలేరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.