యాప్నగరం

అమెరికా వీసా మరింత భారం.. రుసుములు భారీగా పెంపు, వివరాలివే

Us Visa Fees Hike చేయాలని ప్రతిపాదనలు చేసింది. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల పిటిషన్లు, అప్లికేషన్ల ఫీజులను భారీగా పెంచుతూ బైడెన్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు. ఈ ఫీజులకు సంబంధించిన ప్రతిపాదనలను యూఎస్‌సీఐఎస్‌ (USCIS) వెబ్‌సైట్‌‌లో పొందుపరిచారు. ఈ ఫీజుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు 60 రోజుల పాటు వెబ్‌సైట్‌లో ఉంచి.. ఆ తర్వాత ఫీజులు పెంచే అవకాశం ఉంది. 2016 నుంచి వీసా దరఖాస్తు రుసుముల్లో మార్పు చేయలేదట.. అయితే ఆరేళ్ల తర్వాత వాటిని పెంచాలని ప్రతిపాదనలు చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 6 Jan 2023, 10:26 am

ప్రధానాంశాలు:

  • మరింత ప్రియంకానున్న అమెరికా వీసాలు
  • భారీగా ఫీజులు పెంచుతూ ప్రతిపాదనలు
  • యూఎస్‌సీఐఎస్‌ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Us Visa Fees hike
అమెరికా వెళ్లాలనుకుంటున్నవారికి ఓ విధంగా బ్యాడ్ న్యూస్ ఇది. హెచ్‌-1బీ, ఎల్‌-1ఏ, ఎల్‌-1బీ వంటి నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల పిటిషన్లు, అప్లికేషన్ల ఫీజులను భారీగా పెంచుతూ బైడెన్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ఫీజులకు సంబంధించిన ప్రతిపాదనలను యూఎస్‌సీఐఎస్‌ (USCIS) వెబ్‌సైట్‌ ద్వారా తెలిపింది. హెచ్‌-1బి, హెచ్‌-2బి, ఎల్‌-1, ఓ-1, ఈబీ-5 వీసాల రుసుములు భారీగా పెరగనున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా తమ ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవే ఉన్నాయి.
తాజా ప్రతిపాదనల ప్రకారం.. హెచ్‌-1బీ (H-1B) వీసా దరఖాస్తు ధరను 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. ఎల్‌-1 (L-1) వీసా ధర 460 డాలర్ల నుంచి ఏకంగా 1385 డాలర్లకు.. O-1 వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. హెచ్‌-2బీ (H-2B) వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,080 డాలర్లకు పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. మరోవైపు గ్రీన్‌ కార్డు (ఈబీ-5) దరఖాస్తుల రుసుములు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. హెచ్‌-1బి ఇ రిజిస్ట్రేషన్‌ రుసుము ప్రస్తుతం 10 డాలర్లు కాగా తాజా ప్రతిపాదన అమలులోకి వస్తే 215 డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.

ఈ ఫీజుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు 60 రోజుల పాటు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఆ తర్వాత అభిప్రాయాలను స్వీకరించి అమల్లోకి తీసుకురానున్నారు. బైడెన్ ప్రభుత్వం ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ ఫీజులను పెంచినట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో పెండింగ్‌ వీసాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నారు. అంతేకాదు 2016 నుంచి వీసా దరఖాస్తు రుసుముల్లో మార్పు చేయలేదట.. అయితే ఆరేళ్ల తర్వాత వాటిని పెంచాలని ప్రతిపాదించారు. గతేడాది అత్యధికంగా 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.