యాప్నగరం

టీకాతో కరోనా ముప్పు తొలగి పోతుందనుకుంటే పిచ్చితనమే.. ఐరాస సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్ టీకాకు బ్రిటన్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. మహమ్మారి ప్రభావం ఇప్పట్లో పోదని అన్నారు.

Samayam Telugu 4 Dec 2020, 12:10 pm
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మొదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకోగా.. అత్యవసర వినియోగం కోసం ఫైజర్ టీకాను యూకే ఆమోదించింది. ఈ నేపథ్యంలో టీకాపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐరాస సాధారణ సభ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ.. కరోనా వైరస్ ప్రభావం దశాబ్దాలుపాటు ఉంటుందని అన్నారు.
Samayam Telugu ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ


Read Also: జైలు శిక్ష పడిన నేతలపై జీవితకాల నిషేధానికి వ్యతిరేకం.. సుప్రీంలో కేంద్రం

‘కొవిడ్‌-19 మహమ్మారి మొదలై దాదాపు ఏడాది కావస్తోంది.. 1945 తర్వాత ప్రపంచానికి తొలిసారి ఉమ్మడి ముప్పు ఎదురైంది.. ఇది ఇప్పట్లో తొలగిపోదు.. వ్యాక్సిన్‌ వల్ల కరోనా మాయమైపోతుందని అనుకుంటే పిచ్చితనమే.. కాలమే దీనికి పరిష్కారం చూపుతుంది. ఒక టీకా మన వద్ద ఉన్న ఇతర సాధనాలను పూర్తి చేస్తుంది.. కానీ, వాటిని భర్తీ చేయదు అని పేర్కొన్నారు’

Read Also: మోడెర్నా కోవిడ్-19 టీకా యాంటీబాడీల జీవితకాలం మూడు నెలలే!

వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిబద్ధతతో తీవ్రంగా శ్రమించారని, వారందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు. మరి కొన్ని వారాలు, నెలల్లో అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. కరోనాతో ఏడాదిగా ప్రజలు ఎన్నడూలేనంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ప్రజారోగ్యానికి ముప్పు ఎదురయ్యిందని వ్యాఖ్యానించారు.

Read Also: రాహుల్‌కి స్థిరత్వం తక్కువ.. శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

కానీ మనల్ని మనం మోసం చేసుకోవద్దు.. ఒక టీకాకు ఈ మహమ్మారి మాయమైపోదు.. అది సంవత్సరాలు, రాబోయే దశాబ్దాలు కూడా ఉంటుంది అని గుటెర్రెస్ హెచ్చరించారు. పేదరికం తీవ్రమవుతోందని, కరువు విలయతాండవం చేస్తూ గత ఎనిమిది దశాబ్దాలలో అతిపెద్ద ప్రపంచ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

కోవిడ్-19 ఫలితంగా ఈ తరమే కాదు రాబోయే తరాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్యం, బలహీనతలు, అసమానతలు.. అన్యాయానికి గురవుతాయని, వీటిని గాడిలో పెట్టడానికి సమయం పడుతుందని గుటెర్రెస్ చెప్పారు. ఇటీవల డబ్ల్యూహెచ్‌‌ఓ చీఫ్ సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read Also: నేవీ డే.. భారత్ మెరుపుదాడికి పాక్ అంచనాలు తల్లకిందులైన రోజు

‘నిరంతర పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉంది.. పెద్ద ఎత్తున టెస్టింగ్ నిర్వహించి, పాజిటివ్‌గా తేలినవారిని ఐసోలేషన్‌లో ఉంచాలి.. వారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించాలి... వ్యక్తుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది’ అని టెడ్రోస్ సూచించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతికదూరం, చేతులు శుభ్రం చేసుకోవడం కొనసాగించాలని పునరుద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.