యాప్నగరం

ఆక్స్‌ఫర్డ్ క్లినికల్ ట్రయల్స్‌లో విషాదం.. టీకా వేయించుకున్న వాలంటీర్ మృతి

కరోనా వైరస్ మహమ్మారిని అంతచేసే టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు టీకాలు కీలకమైన మూడో దశకు చేరుకున్నాయి.

Samayam Telugu 22 Oct 2020, 10:19 am
కరోనా వైరస్ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో అపశ్రుతి దొర్లింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటీర్ మరణించినట్టు బ్రెజిల్ బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆక్స్‌ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్న వేళ.. ఈ విషాదం చోటుచేసుకోవడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇటీవల బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో మూడో దశ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, బ్రిటీష్‌ రెగ్యులేటర్స్‌ నుంచి అన్ని అనుమతులూ రావడంతో ప్రయోగాలు పునఃప్రారంభించారు.
Samayam Telugu ఆక్స్‌ఫర్డ్ టీకా
Oxford Vaccine


Read Also: ఘాటెక్కిన ఉల్లి.. కేంద్రం కీలక నిర్ణయం.. దిగిరానున్న ధరలు
దీంతో భారత్‌, బ్రెజిల్‌ సహా పలు దేశాల్లో పరీక్షలకు ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ వ్యక్తి మృతిచెందాడని, ఇందుకు సంబంధించిన ‘ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టు’ తమకు అందిందని బ్రెజిల్‌ ఆరోగ్య విభాగం వెల్లడించింది. సదరు వ్యక్తి టీకా దుష్ప్రభావం వల్ల చనిపోయాడా? లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? అతడు ఏ ప్రాంతానికి చెందినవాడు అనే వివరాలను అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం. కానీ, వ్యాక్సిన్‌ తదుపరి ప్రయోగాలు కొనసాగుతాయని మాత్రం ప్రకటించారు.

Read Also:ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా గిఫ్ట్

ఇదిలా ఉండగా, వాలంటీరు మృతి వివరాలను సమీక్షించామనీ, తమ టీకా భద్రతపై అనుమానాలు అక్కర్లేదనీ ఆక్స్‌ఫర్డ్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ బక్స్‌టన్‌ వ్యాఖ్యానించారు. గోప్యత అవసరాలు, క్లినికల్ ట్రయల్స్ నియమాల ప్రకారం వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యానించలేమని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి పేర్కొన్నారు. కానీ ప్రయోగాలు నిలిపివేయడానికి దారితీసే ఆందోళనలు లేవని ఆయన అన్నారు.

Read Also:నితీశ్ సభలో లాలూకు జేజేలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీహార్ సీఎం

ఆక్స్‌ఫర్డ్ టీకాను కొనుగోలు చేసి, తమ దేశంలో ఉత్పత్తి చేయాలని బ్రెజిల్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ టీకాను రియో-డీ-జెనిరోలోని ఫియోక్రూజ్ రిసెర్చ్ సెంటర్‌లో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే చైనా వ్యాక్సిన్ సైనోవ్యాక్‌ను సా పౌలో రాష్ట్రంలో ప్రయోగత్మాకంగా పరీక్షించారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ మొత్తం 5.2 మిలియన్ల మంది వైరస్ బారినపడగా.. 154,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Read Also: రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏనుగులను ఢీకొట్టిన రైలు.. ఇంజిన్‌ను సీజ్ చేసిన అటవీ అధికారులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.