యాప్నగరం

వీడియో: భారత త్రివర్ణ పతాక రంగుల్లో మెరిసిన బుర్జ్ ఖలీఫా

మోదీకి ఘన స్వాగతం పలికేందుకు యూఏఈ ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం ‘బుర్జ్ ఖలీఫా’ టవర్‌ భారత త్రివర్ణ పతాక రంగుల్లో మెరిసిపోయింది.

TNN 11 Feb 2018, 6:34 pm
భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈలో ఘన స్వాగతం లభించింది. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఆ దేశ ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం ‘బుర్జ్ ఖలీఫా’ టవర్‌ భారత త్రివర్ణ పతాక రంగుల్లో మెరిసిపోయింది. 828 మీ. ఎత్తైన ఈ టవర్‌ త్రివర్ణ రంజితంగా మెరిసిపోతుంటే భారతీయుల గుండెలు ఉప్పొంగాయి. పలువురు ప్రపంచ నేతలకు గతంలో లభించిన రెడ్ కార్పెట్ వెల్‌కమ్ కూడా ఈ స్వాగతం ముందు దిగదుడుపేనేమో! ఈ అరుదైన దృశ్యాన్ని కళ్లారా చూడటానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.
Samayam Telugu watch dubais iconic tower burj khalifa light up in colours of indian flag
వీడియో: భారత త్రివర్ణ పతాక రంగుల్లో మెరిసిన బుర్జ్ ఖలీఫా


యూఏఈలో మోదీ కాలు పెట్టగానే ఆయనకు స్వాగతం పలికేందుకు చేసిన ఏర్పాట్లలో ఇదొక భాగం. శనివారం (ఫిబ్రవరి 10) రాత్రి 7.15 గంటల నుంచి రాత్రి 11:15 గంటల వరకు ప్రతి గంటకోసారి త్రివర్ణ రంజితం అయ్యేలా లైటింగ్ షో ఏర్పాటు చేశారు.

భూగ్రహంపై ఫోటో ఫ్రేమ్ ఆకారంలో ఉన్న అత్యంత భారీ కట్టడం ‘దుబాయ్ ఫ్రేమ్’ కూడా భారతీయ త్రివర్ణ పతాకం రంగుల్లో మెరిసిపోయింది. భారత్‌తో తమ మైత్రీబంధానికి గుర్తుగా ఇదే ఏడాది జనవరి 26న మన దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇదే టవర్‌పై లైట్ల కాంతులతో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.