యాప్నగరం

WHO: బిగ్ రిలీఫ్.. కరోనా గురించి డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన

WHO: కరోనా వైరస్ దాదాపు నాలుగేళ్లుగా ప్రపంచాన్ని వణికించింది. లక్షలాది మందిని బలి తీసుకుంది. కోట్లాది మందిని ఆసుపత్రుల పాలు చేసింది. దీంతో కరోనా అనే పదం వింటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 5 May 2023, 8:39 pm

ప్రధానాంశాలు:

  • కరోనా గురించి డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన
  • గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పరిధి నుంచి తొలగింపు
  • 2020 జనవరి 30న గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Corona Virus
కరోనా వైరస్
WHO: కరోనాను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పరిధి నుంచి WHO తొలగించింది. కోవిడ్ ఇకపై పబ్లిక్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 15వ ఎమర్జెన్సీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రకటించారు.
గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ (Global Health Emergency) నుంచి కరోనాను తొలగించడం అంటే.. కోవిడ్ ముగిసిందని అర్థం కాదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ స్పష్టం చేశారు. గత వారం కూడా ప్రతి మూడు నిమిషాలకు కోవిడ్ ఒకరిని చంపిందని గుర్తు చేశారు. ఇంకా కొత్త వేరియంట్‌లు వస్తున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు.
2020 జనవరి 30న కోవిడ్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించామని WHO తెలిపింది. హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. కరోనాను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినప్పుడు.. చైనాలో 100 కంటే తక్కువ కరోనా కేసులు ఉన్నాయి. ఎవరూ మరణించలేదు. కానీ మూడేళ్ల తర్వాత మరణాల సంఖ్య 7 మిలియన్లకు పెరిగింది. ఇందులో దాదాపు 2 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి.

గత ఏడాది కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. పబ్లిక్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ నుంచి కరోనాను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కోవిడ్ చాలా ప్రభావాన్ని చూపిందని, పాఠశాల నుంచి కార్యాలయం వరకు మూసి వేశారని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ సమయంలో చాలా మంది ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యారు. ఈ వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా తలకిందులు చేసింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.