యాప్నగరం

ఎవరన్నారు Print is dead అని?! అది కరెక్ట్ కాదు

మనమిప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. రోజురోజుకు ఉన్నదంతా డిజిటలీకరణ చెందుతుంటే ప్రింట్ మీడియా పని

Samayam Telugu 10 Feb 2017, 2:52 pm
మనమిప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. రోజురోజుకు ఉన్నదంతా డిజిటలీకరణ చెందుతుంటే ప్రింట్ మీడియా పని అయిపోతుందని అన్నావాళ్లు చాలా మందే ఉన్నారు. అరచేతిలో పత్రిక పట్టుకొని గంటల తరబడి చదివే కన్నా..ఆన్ లైన్ లభించే ఈ-పేపర్లే బెటర్ అన్ని వాళ్లూ లేకపోలేదు. రానున్న రోజుల్లో ప్రింట్ (పత్రికలు) అనేదే ఉండదని, ప్రింట్ పనైపోయిందని Print is dead అని డిజిటల్ ప్రేమికులు కోడై కూశారు. డిజిటల్ మీడియాకు మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది.
Samayam Telugu who said print is dead for readers print has priority
ఎవరన్నారు Print is dead అని?! అది కరెక్ట్ కాదు


ప్రపంచం ఎంతమారినా....డిజిటల్ యుగంలో ఎన్నిమార్పులు వచ్చినా..ఉదయాన్నే పాఠకుణ్ని పత్రికలు పలుకరించకపోతే..ఆ వెలితి అంతాఇంతా కాదు. గతేడాది ఇండియన్ రీడర్ షిప్ సర్వే ప్రకారం..దేశంలో 7శాతం మేర పత్రికలు చదివే వారు పెరిగారని తేలింది. జాతీయ, ప్రాంతీయ పత్రికలు కూడా కొత్తగా యేడాదికేడాది పెరిగిపోతున్నాయి.

వాషింగ్టన్ లోని ఎల్ ఎంయూ నిర్వహించిన ఓ అధ్యయనంలో కూడా ప్రింట్ మీడియాకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని నిరూపితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పాఠకులు 89శాతం మేర ప్రింట్ మీడియా మీద ఆధారపడితే..కేవలం 4శాతం మందే ఆన్ లైన్ లభించే వార్తలను చదువుతారని స్పష్టమైంది.

గతేడాది యూకేలోని వివిధ పత్రికలను సర్వే కోసం నమూనాలు తీసుకున్నారు. ఇంటర్నెట్ వినియోగంలో ముందుండే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ దినపత్రికలకు ఆదరణ తగ్గకపోవడం విశేషం.

‘‘పాఠకుడు సగటున రోజు 40నిమిషాలకు పత్రికలు చదివేందుకు కేటాయిస్తే..ఆన్ లైన్ లో వార్తలు చదివేందుకు కనీసం ఒక్క నిమిషం కూడా టైం కేటాయించకపోవడం గమనార్హం’’ అని సర్వేకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ నీల్ తుర్మన్ అభిప్రాయపడ్డారు.

పత్రికల్లో ఏదైనా హెడ్ లైన్ ఆసక్తిగా కనిపిస్తే దానికి సంబంధించిన వార్తను ఆసాంతం చదువుతారని..అదే ఆన్ లైన్ అయితే అలా చూసి వదిలిపెడ్తారని సర్వేలో తేలింది.

అయితే ఇప్పటికీ జర్మనీలో వార్తలకోసం పత్రికలపైన 38 శాతం ఆధారపడితే...యూకేలో మాత్రం 13శాతం పత్రికలను ఆశ్రయిస్తారని ఎల్ ఎంయూ వెల్లడించింది.

ఏ టెక్నాలజీ వచ్చినా దేని ప్రాధాన్యత దానిదే అని ఈ సర్వే ద్వారా అర్థమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.