యాప్నగరం

డిజిటల్ లావాదేవీలతో లక్ష కోట్ల డాలర్ల ఆదా!

అన్ని రంగాల్లోనూ నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్‌ చెల్లింపులకు మళ్లడం వల్ల లక్షల కోట్ల డాలర్లు ఆదా అవుతాయని డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇనీషియేటివ్ వెల్లడించింది.

TNN 19 Jan 2017, 9:05 am
అన్ని రంగాల్లోనూ నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్‌ చెల్లింపులకు మళ్లడం వల్ల లక్షల కోట్ల డాలర్లు ఆదా అవుతాయని డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇనీషియేటివ్ వెల్లడించింది. అలాగే వినియోగదారులు కూడా ప్రయోజనం పొందుతారని తెలిపింది. డిజిటైజేషన్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, దీనికి విధానపరమైన చర్యలు అవసరమని డీఐటీ పేర్కొంది.
Samayam Telugu world economic forum report on digital transactions
డిజిటల్ లావాదేవీలతో లక్ష కోట్ల డాలర్ల ఆదా!


డిజిటైజేషన్‌ వల్ల పెద్ద మొత్తంలో సామాజిక ప్రయోజనాలు కలుగుతాయని, ఉద్యోగాల కల్పన, ఆదాయ అసమానతలు తగ్గుతాయని వివరించింది. తద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలతోపాటు కార్బన్‌ ఉద్గారాలను, కాలహరణను, వినియోగదారుల వ్యయాలను తగ్గిస్తుందని డీఐటీ తన నివేదికలో పేర్కొం ది. డిజిటల్‌ ప్రయోజనాలు పొందేందుకు సమష్టి చర్యలు అవసరమని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని డీటీఐ హెడ్‌ బ్రూస్‌ వెనెల్ట్‌ సూచించారు.

అన్ని రంగాల్లోనూ డిజిటలీకరణ వల్ల లక్షలాది ప్రాణాలను కాపాడుకోవడమే కాదు లక్షలాది డాలర్లు కూడా ఆదా అవుతాయని అని నివేదికలో తెలియజేసింది. అలాగే నైపుణ్యాలను పెంచుకోవడంతోపాటు వేగంగా మార్పు చెందుతున్న మార్కెట్ల అభిరుచులను తీర్చేవిధంగా విద్యాపరమైన మార్పుల అవసరాన్ని కూడా నొక్కివక్కానించింది.

ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించి అందరి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రోత్సాహించే సామర్థ్యాలు కొత్త సాంకేతిక పరిప‌రిఙ్ఙానానికి ఉన్నాయని తెలిపింది. అయితే ప్రపంచీకరణ తిరోగమనం, ప్రజాకర్షణ విధానాలు, సామాజిక అస్థిరత్వంతో వీటికి ముప్పేనని మాత్రం హెచ్చరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.