యాప్నగరం

అమెరికాలో పీకల్లోతు వరద నీటిలో తెలుగు విద్యార్థులు

గత మూడు రోజులుగా అమెరికాలోని టెక్సాస్‌లో భీభత్సం సృష్టిస్తున్న హ‌రికేన్ హార్వే వల్ల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హూస్ట‌న్

TNN 28 Aug 2017, 10:35 pm
గత మూడు రోజులుగా అమెరికాలోని టెక్సాస్‌లో భీభత్సం సృష్టిస్తున్న హ‌రికేన్ హార్వే వల్ల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హూస్ట‌న్ యూనివ‌ర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న భార‌తీయ విద్యార్థులు ఇబ్బందులపాలవుతున్నారు. హూస్ట‌న్‌లో ఉన్న ఇండియ‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ తమకి అందించిన సమాచారం ప్రకారం సుమారు 200 మంది భార‌తీయ విద్యార్థులు ఈ యూనివర్శిటీలోకి ప్రవేశించిన వరద నీటిలో పీకల్లోతులో చిక్కుకున్న‌ట్టుగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ఇవాళ సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. ఈ వరదల్లో చిక్కుకున్న భార‌తీయ విద్యార్థుల‌ను కాపాడేందుకు ఇండియన్ కాన్సూల్ జనరల్ అనుపమ రాయ్ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు సుష్మా స్వరాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu 200 indian students marooned in houston due to hurricane harvey
అమెరికాలో పీకల్లోతు వరద నీటిలో తెలుగు విద్యార్థులు

@CGHoust has informed me that 200 Indian students at University of Houston are marooned. They are surrounded by neck deep water. /1— Sushma Swaraj (@SushmaSwaraj) August 28, 2017
రెస్క్యూ బోట్లు లేని కార‌ణంగా యూనివర్శిటీలోని విద్యార్థుల‌కు ఆహారాన్ని చేర‌వేసేందుకు ఇండియన్ కాన్సూలేట్ జనరల్ సిబ్బంది చేసిన ప్ర‌య‌త్నాల‌ను అమెరికా కోస్టు గార్డ్ సిబ్బంది అడ్డుకుంటున్నారని అనుపమ రాయ్ సుష్మా స్వరాజ్‌కి తెలిపారు.

భారతీయ విద్యార్థులు శాలిని, నిఖిల్ భాటియా ప్రస్తుతం ఐసీయు చికిత్స పొందుతున్నారని, వారి బంధువుల వీలైనంత త్వరగా వారిని చేరుకునే ఏర్పాట్లు చేస్తున్నామని సుష్మా స్వరాజ్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
Indian students Shalini and Nikhil Bhatia are in ICU. We are ensuring that their relatives reach there at the earliest. /4— Sushma Swaraj (@SushmaSwaraj) August 28, 2017
ఇదిలావుంటే, అక్కడికి సమీపంలో వున్న ప్రవాస భారతీయులు బాధిత విద్యార్థులని ఆదుకునేందుకు అక్కడికి చేరుకుంటున్నారు. రేపు సాయంత్రంలోగా న్యూ టెరిటరీ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇక్కడ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మరో సురక్షిత ప్రాంతానికి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి మీరే ఏదైనా సలహా సూచించండి అని ఫేస్‌బుక్ ద్వారా హూస్టన్‌లో వున్న భారతీయులకి విజ్ఞప్తి చేశారు ఇదే ప్రాంతంలో చిక్కుకున్న మరో భారతీయురాలు వసుంధరా రెడ్డి.

బాధితులకి హూస్టన్‌లో వున్న భారతీయుల నుంచి సహాయం అందుతోంది అని హూస్టన్‌లోనే వుంటున్న కిషోర్ రామరాజు తెలిపారు. కిషోర్ రామరాజు స్వస్థలం నల్గొండ జిల్లా. ఉడ్‌ల్యాండ్‌లో వున్న హైదరాబాద్ రెస్టారెంట్ అక్కడి వరద బాధితులకి ఉచితంగా ఆహారం సరఫరా చేయడం అభినందించదగిన విషయం.

హూస్టన్ యూనివర్శిటీలో విద్యను అభ్యసిస్తున్న ఇండియన్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు రవిశంకర్ స్పందిస్తూ.. వీలైనంత వరకు బాధిత విద్యార్థులకి అండగా వుండేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. "స్ట్రాట్‌ఫోర్డ్, ఫెలిక్స్ అపార్ట్‌మెంట్స్‌లో వుంటున్న సుమారు 250 మందికి తాము ఆహారం, ఆశ్రయం కల్పించగలం. మిగతావారికి ఆహారం అందించేందుకు యూనివర్శిటీలోని హోటల్స్ సిద్ధంగా వున్నాయి కానీ బాధితుల వద్దకు వెళ్లడానికు బోట్లు లేవు'' అని రవిశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.