జాత్యహంకారంతో ఊగిపోతున్న అమెరికాలో మరో భారతీయుడిపై కాల్పులు జరిగాయి. నెల సమయంలో భారతీయులపై దాడులు జరగడం ఇది మూడోసారి. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
భారత సంతతికి చెందిన 39 ఏళ్ళ దీప్ రాయ్ అమెరికా పౌరసత్వంతో చాలా కాలంగా అక్కడే ఉంటున్నారు. వాషింగ్టన్ లోని కెంట్ లో నివాసముంటున్న దీప్ రాయ్.. ఇంటి బయట తన కారును రిపేర్ చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని అరుస్తూ రాయ్ పై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం రాయ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
భారతీయుడిపై కాల్పులు జరగడంపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాయ్ తండ్రి సర్ధార్ హర్పాల్ సింగ్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
గత గురువారం భారత్ కు చెందిన వ్యాపారి హర్నీష్ పటేల్ హత్యకు గురయ్యారు. అంతకు ముందు తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్లపై అడమ్ ప్యూరింటన్ అనే వ్యక్తి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
భారత సంతతికి చెందిన 39 ఏళ్ళ దీప్ రాయ్ అమెరికా పౌరసత్వంతో చాలా కాలంగా అక్కడే ఉంటున్నారు. వాషింగ్టన్ లోని కెంట్ లో నివాసముంటున్న దీప్ రాయ్.. ఇంటి బయట తన కారును రిపేర్ చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని అరుస్తూ రాయ్ పై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం రాయ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
భారతీయుడిపై కాల్పులు జరగడంపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాయ్ తండ్రి సర్ధార్ హర్పాల్ సింగ్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
గత గురువారం భారత్ కు చెందిన వ్యాపారి హర్నీష్ పటేల్ హత్యకు గురయ్యారు. అంతకు ముందు తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్లపై అడమ్ ప్యూరింటన్ అనే వ్యక్తి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.