యాప్నగరం

అమెరికాలో వరంగల్ యువతిపై కాల్పులు

అమెరికాలో భారతీయులపై జాతి విద్వేష దాడుల పరంపర కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు.

TNN 6 Mar 2017, 11:12 pm
అమెరికాలో భారతీయులపై జాతి విద్వేష దాడుల పరంపర కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా వరంగల్‌కు చెందిన జ్యోతి అనే యువతిపై ఓ నల్ల జాతీయుడు కాల్పులు జరిపాడు. డబ్బులు డిమాండ్ చేస్తూ నిందితుడు జ్యోతిని తుపాకితో కాల్చాడు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu black american shoots indian telugu girl jyothi
అమెరికాలో వరంగల్ యువతిపై కాల్పులు


జ్యోతి ప్రస్తుతం కాలిఫోర్నియా సమీపంలోని ఫ్రీమౌంట్‌లో నివాసం ఉంటోంది. షాపింగ్ కోసం వచ్చిన బయటకు వచ్చిన ఆమె తన కారును పార్కింగ్ చేసి వస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలయ్యాయి. కాల్పులకు తెగబడ్డ నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత వారం రోజులుగా భారతీయులపై జాత్యాహంకార దాడులు చోటు చేసుకుంటున్నాయి.

గత ఫిబ్రవరి 13 న వరంగల్‌కు వంశీచరణ్ రెడ్డి, ఫిబ్రవరి 28 కన్సస్ సిటీలో కూచిభొట్ల శ్రీనివాసరావు, మార్చి 4 న సౌత్ కరోలినాలో గుజరాత్‌కు చెందిన హర్నిశ్ పటేల్ అనే వ్యాపారి దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దేశాధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా భారతీయులే లక్ష్యంగా జాతి విద్వేష దాడులు చోటు చేసుకుంటున్నాయి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.