యాప్నగరం

కుప్పకూలిన ఫ్లైట్: తెలుగు దంపతుల మృతి

అమెరికాలోని తూర్పుఓహియోలో ప్రైవేటు చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలిన దుర్ఘటనలో తెలుగు దంపతులు దుర్మణం..

TNN & Agencies 11 Jul 2017, 10:38 pm
అమెరికాలోని తూర్పుఓహియోలో ప్రైవేటు చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలిన దుర్ఘటనలో కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన డాక్టర్ కాలపాతపు ఉమామహేశ్వర రావు (63), సీత (62) దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఇండియానాలోని కాస్ కౌంటీ నుంచి వెస్ట్ వర్జీనియాలోని పర్క్స్‌బరీలోని ఎయిర్ పోర్టుకి బయల్దేరిన ప్రైవేటు విమానం ఓహియో రాష్ట్రంలోని బెవర్లీ వద్ద ఓ సరస్సులో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో కేవలం ఈ ఇద్దరు దంపతులు మాత్రమే ప్రయాణికులుగా వున్నట్టు సమాచారం.
Samayam Telugu couple from andhra pradesh died in us plane crash
కుప్పకూలిన ఫ్లైట్: తెలుగు దంపతుల మృతి


రాజ్ క్లినిక్స్ పేరిట క్లినిక్ నిర్వహిస్తోన్న ఈ జంట గత 40 ఏళ్లుగా అమెరికాలోనే స్థిరపడినట్టు తెలుస్తోంది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపమే ఈ దుర్ఘటనకి కారణమైందని అక్కడి అధికారవర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.