యాప్నగరం

‘ఎన్ఆర్ఐ హిత’.. ప్రవాసుల కోసం ప్రత్యేక పోర్టల్

ప్రవాస భారతీయులకు(ఎన్ఆర్ఐలు) ఒకే వేదిక ద్వారా స్వదేశంలో అన్ని రకాల సేవలందించేందుకు nrihita.com అనే పోర్టల్ ప్రారంభమైంది.

TNN 29 Oct 2017, 1:23 pm
ప్రవాస భారతీయులకు(ఎన్ఆర్ఐలు) ఒకే వేదిక ద్వారా స్వదేశంలో అన్ని రకాల సేవలందించేందుకు nrihita.com అనే పోర్టల్ ప్రారంభమైంది. ‘యాడ్‌నిగమ్’ పేరిట ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న కాసిరెడ్డి రాజిరెడ్డి ఈ మేరకు ‘ఎన్ఆర్ఐ హిత’ సేవలను ప్రారంభించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన ఈ పోర్టల్.. విదేశాల్లోని భారతీయులకు, భారత్‌లో ఉంటూ వారిపై ఆధారపడే తల్లిదండ్రులు, ఇతరులకు వివిధ రకాల సేవలను అందించనుంది. ఆస్తుల నిర్వహణ, సంరక్షణ, లీగల్ అడ్వైజరీ, కంపెనీ రిజిస్ట్రేషన్, పన్ను రిటర్నుల ఫైలింగ్ వంటి ఎక్స్‌క్లూజివ్ సర్వీసులు అందించనుంది.
Samayam Telugu exclusive nri portal nrihita com launched
‘ఎన్ఆర్ఐ హిత’.. ప్రవాసుల కోసం ప్రత్యేక పోర్టల్


వీటితో పాటు వృద్ధులు, తల్లిదండ్రుల కేర్‌ టేకింగ్‌, ట్రావెల్‌, టూర్‌ గైడ్‌, వీసా, పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డ్‌ దరఖాస్తు, యుటిలిటీ, పార్శిల్‌, కొరియర్‌ సర్వీసుల వంటి సేవలను అందించనున్నట్లు వ్యవస్థాపకులు, సీఈవో రాజిరెడ్డి తెలిపారు. తొలుత హైదరాబాద్ కేంద్రంగా సేవలు ప్రారంభిస్తున్నట్లు, క్రమంగా తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ వెబ్‌సైట్ ద్వారా సేవలు పొందగోరేవారు పేపాల్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చని, ఆఫ్‌లైన్ చెల్లింపు సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని ప్రీ-పెయిడ్ సర్వీసులేనని, ఒక్కో సర్వీసుకు కనీస చార్జీ 10 డాలర్లని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.