విదేశాలలో ఉన్న తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్నారై పాలసీని తెచ్చే ప్రయత్నంలో ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. ఆయన లండన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎన్నారైలు కూడా తమ వంతు సహకారాన్ని అందించారని తెలిపారు. వారి కోసం ఎన్నారై పాలసీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందన్నారు. ఆ పాలసీ రూపకల్పన కోసం తగిన సలహాలను, సూచనలను అందించాలని ఆయన కోరారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ పాలసీ నిర్మాణం జరుగుతుందని, అతనికే సూచనలు పంపించమని చెప్పారు. ప్రసంగం అనంతరం ప్రవాస భారతీయులు ఉపముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ల్యామ్ బెత్, హౌన్ స్లా నగరాల మేయర్లు కూడా పాల్గొన్నారు.
ప్రవాస భారతీయుల కోసం ఎన్నారై పాలసీ
విదేశాలలో ఉన్న తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్నారై పాలసీని తెచ్చే ప్రయత్నంలో ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు.
TNN 30 Aug 2016, 8:48 am