యాప్నగరం

కాల్పులు జరిగిన కన్సస్ సిటీలో భారతీయుల ర్యాలీ

అమెరికాలోని కన్సస్ సిటీలోని ఓ బార్‌లో జాత్యంహంకారి ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన...

TNN 27 Feb 2017, 6:12 pm
అమెరికాలోని కన్సస్ సిటీలోని ఓ బార్‌లో జాత్యంహంకారి ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కన్సస్ సిటీలోని భారతీయులంతా కొవ్వొత్తుల ప్రదర్శనతో శాంతి ర్యాలీ నిర్వహించారు. కన్సస్ సిటీ పరిసరాల్లో వున్న భారతీయులంతా ఈ ర్యాలీలో పాల్గొని భారతీయులంతా ఏకమవ్వాల్సిన ఆవశ్యకత వుందని నినాదాలు చేశారు. శ్రీనివాస్ కూచిబొట్ల స్నేహితులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
Samayam Telugu hundreds joins kansas peace march and prayer meeting about srinivas kuchibhotla soul
కాల్పులు జరిగిన కన్సస్ సిటీలో భారతీయుల ర్యాలీ


వీ వాంట్ పీస్, వీ లవ్ పీస్, ఐక్యమత్యమే మహా బలం వంటి నినాదాలు కలిగిన పోస్టర్లు, ఫెక్లీలతో ర్యాలీ నిర్వహించిన భారతీయులు.. విద్వేషపూరితమైన రాజకీయాలకు తాము వ్యతిరేకం అని అమెరికా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు ఈ ర్యాలీలో పాల్గొన్న భారతీయులు. భారతీయులు ఏకమై నిర్వహించిన ఈ ర్యాలీలో లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కలైర్, యూఎస్ కాంగ్రెస్‌మేన్ కెవిన్ యోడర్, ఒలేత్ మేయర్ మైక్ కోప్‌ల్యాండ్, ఓలెత్ పోలీస్ ఉన్నతాధికారి స్టీవెన్‌తోపాటు స్థానిక అధికారులు పాల్గొని భారతీయులకి తమ మద్దతు తెలియజేశారు.

శ్రీనివాస్ కూచిభొట్ల స్నేహితుడు అలోక్ రెడ్డి, భారతీయులని కాపాడే ప్రయత్నంలో కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అమెరికన్ ఐయాన్ గ్రిల్లట్ సిస్టర్స్ కూడా ఈ పీస్ మార్చ్‌లో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.