బిగ్ టికెట్ అబుదాబి పేరుతో యూఏఈ నిర్వహించే లాటరీలో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. భారత్ నుంచి నైజారియాకు వలస వెళ్లిన డిక్సన్ కట్టితహారా అబ్రహాం అబుదాబి లాటరీ 192 సిరీస్లో రూ.18 కోట్లు గెలుపొందాడు. అబుదాబి విమానాశ్రయంలో నిర్వహించే ఈ లాటరీలో అబ్రహాం ఓ టికెట్ కొనుగోలు చేశాడు. ఆదివారం లాటరీ విజేతను ప్రకటించగా అందులో అబ్రహం కొనుగోలు చేసిన 012027 నెంబరు గల టిక్కెట్ బంపర్ ప్రైజ్ గెలుచుకుంది. విజేతగా నిలిచిన అబ్రహాంను 10 మిలియన్ దీర్హామ్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.18 కోట్లు వరించాయి. ఇక ఈ లక్కీ డ్రాలో తొమ్మిది మంది విజేతలను ఎంపిక చేయగా.. అందులో 5 గురు భారతీయులు ఉండటం విశేషం. వీరిలో మనోహర్ టికామ్దాస్ రూప్రెల్లికి లక్ష దీర్హామ్లు, రిషి ఫరూక్ వాజా వాల్లప్పికి 80 వేలు దిర్హామ్లు, జెన్నీ మైఖైల్కు 70 వేల దిర్హామ్లు, రంజిత్ కుమార్ ఆనంద్ 50 వేలు, జిజి జాన్ 30 వేలు దిర్హామ్లు గెలుపొందారు. వీరితోపాటు మరో ముగ్గురు పాకిస్థానీలు, యూఏఈకి చెందిన వ్యాపారవేత్తను కూడా లాటరీ వరించింది.
ఇదే లాటరీలో మరో భారతీయుడు రాఘవన్ సుదర్శన్ లాండ్ రోవర్ సిరీస్ 11 కారును సొంతం చేసుకున్నాడు. ‘బిగ్ టికెట్ అబుదాబి’ పేరుతో నిర్వహించే ఈ లాటరీకి విదేశాల్లో సైతం చాలా క్రేజ్ ఉంది. యూఏఈ నిర్వహించే లాటరీ కార్యక్రమాల్లో ఇదే అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ లాటరీలో విజేతలుగా ఇటీవల భారతీయులే నిలవడం గమనార్హం. గత ఏప్రిల్లోనూ కేరళకు చెందిన అనిల్ వర్ఘీసే తెవెరిల్ 7 మిలియన్ దీర్హామ్లు అంటే సుమారు 12.74 కోట్లు గెలుచుకున్నాడు. గత 26 ఏళ్లుగా యూఏఈలో పనిచేస్తున్న అనిల్, భారతీయులు అధికంగా ఉండే అబ్బాసియాలో నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు మాత్రం కేరళలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడు.
అలాగే గత జనవరి నిర్వహించిన లాటరీలోనూ ఓ ప్రవాస భారతీయుడు 12.3మిలియన్ దీర్హామ్లు గెలుచుకున్నాడు. గతేడాది మార్చిలోనూ కేరళకు చెందిన శ్రీరాజ్ కృష్ణన్ కొప్పరెంబిల్ (33) అబుదాబీ బిగ్ టికెట్ డ్రాలో 7 మిలియన్ దిర్హామ్లు అంటే సుమారు రూ.12.72 కోట్లు గెలుపొందాడు. ఒకే ఒక్క లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది.
ఇదే లాటరీలో మరో భారతీయుడు రాఘవన్ సుదర్శన్ లాండ్ రోవర్ సిరీస్ 11 కారును సొంతం చేసుకున్నాడు. ‘బిగ్ టికెట్ అబుదాబి’ పేరుతో నిర్వహించే ఈ లాటరీకి విదేశాల్లో సైతం చాలా క్రేజ్ ఉంది. యూఏఈ నిర్వహించే లాటరీ కార్యక్రమాల్లో ఇదే అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ లాటరీలో విజేతలుగా ఇటీవల భారతీయులే నిలవడం గమనార్హం. గత ఏప్రిల్లోనూ కేరళకు చెందిన అనిల్ వర్ఘీసే తెవెరిల్ 7 మిలియన్ దీర్హామ్లు అంటే సుమారు 12.74 కోట్లు గెలుచుకున్నాడు. గత 26 ఏళ్లుగా యూఏఈలో పనిచేస్తున్న అనిల్, భారతీయులు అధికంగా ఉండే అబ్బాసియాలో నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు మాత్రం కేరళలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడు.
అలాగే గత జనవరి నిర్వహించిన లాటరీలోనూ ఓ ప్రవాస భారతీయుడు 12.3మిలియన్ దీర్హామ్లు గెలుచుకున్నాడు. గతేడాది మార్చిలోనూ కేరళకు చెందిన శ్రీరాజ్ కృష్ణన్ కొప్పరెంబిల్ (33) అబుదాబీ బిగ్ టికెట్ డ్రాలో 7 మిలియన్ దిర్హామ్లు అంటే సుమారు రూ.12.72 కోట్లు గెలుపొందాడు. ఒకే ఒక్క లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది.