అమెరికాలో భారతీయులకు రక్షణ కరవవుతుంది. కూచిభొట్ల శ్రీనివాస్ మరణం, శశికళ, ఆమె కుమారుడి హత్యను మర్చిపోకముందే... మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. అతడిని డబ్బు కోసం దోపిడీ దొంగలు హత్య చేశారని అమెరికా పోలీసులు చెబుతున్నారు. హతుడిని వాషింగ్టన్ లో ఉంటున్న విక్రమ్ జర్యాల్ (26) గా గుర్తించారు పోలీసులు. ఆయన ఓ గ్యాస్ స్టేషన్లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. గురువారం ముసుగు వేసుకుని వచ్చిన ఇద్దరు దొంగలు విక్రమ్ పై తుపాకితో కాల్పులు జరిపారు. అనంతర అతని దగ్గర ఉన్న డబ్బు తీసుకుని పారిపోయారు. కొనఊపిరితో ఉన్న విక్రమ్ను కొందరు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన కాసేపటికే విక్రమ్ మరణించాడు. విక్రమ్ స్వస్థలం పంజాబ్ లోని హోషియార్పూర్. ఇతను నెలక్రితమే అమెరికా వెళ్లాడు. దీంతో విక్రమ్ కుటుంబంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.
కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి ట్విట్టర్లో ఈ సంఘటనపై స్పందించారు. విక్రమ్ సోదరుడు సుష్మాకు సాయం కోరుతూ ట్వీట్ చేశాడు. వెంటనే సుష్మా స్పందించి విక్రమ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అమెరికాలోని ఇండియన్ ఎంబసీకి విక్రమ్ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు సాయం చేయాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు.
My heartfelt condolences on your brother's tragic death. I am asking @IndianEmbassyUS to provide all help and assistance. https://t.co/e30cHGYEJE — Sushma Swaraj (@SushmaSwaraj) April 7, 2017
కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి ట్విట్టర్లో ఈ సంఘటనపై స్పందించారు. విక్రమ్ సోదరుడు సుష్మాకు సాయం కోరుతూ ట్వీట్ చేశాడు. వెంటనే సుష్మా స్పందించి విక్రమ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అమెరికాలోని ఇండియన్ ఎంబసీకి విక్రమ్ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు సాయం చేయాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు.
My heartfelt condolences on your brother's tragic death. I am asking @IndianEmbassyUS to provide all help and assistance. https://t.co/e30cHGYEJE — Sushma Swaraj (@SushmaSwaraj) April 7, 2017