యాప్నగరం

ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి సజీవ దహనం

ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన బస్ డ్రైవర్‌ను ఓ దుండగుడు సజీవ దహనం చేశాడు.

TNN 28 Oct 2016, 6:44 pm
ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన బస్ డ్రైవర్‌ను ఓ దుండగుడు సజీవ దహనం చేశాడు. బ్రిస్బేన్ సిటీలో నివాసి అయిన మన్మీత్ అలీషెర్ (29) బ్రిస్బేన్ సిటీ కౌన్సిల్ బస్‌ను నడుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు నడుపుతున్న మన్మీత్‌పై దుండగుడు ఒక్కసారిగా దాడిచేసి మంటలను వ్యాపింపచేసే ఆయుధంతో రసాయనాన్ని చల్లాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి మన్మీత్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.
Samayam Telugu indian origin bus driver burnt alive in australia
ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి సజీవ దహనం

ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ప్రయాణికులు బస్సు తలుపు, కిటీకీల నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిలో ఆరుగురు స్వల్పంగా గాయపడటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే దాడిచేసిన దుండగుణ్ని పట్టుకున్నామని బ్రిస్బేన్ పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీస్ కమిషనర్ ఇయాన్ స్టీవార్ట్ పేర్కొన్నారు. ఇది ఉగ్రవాద చర్యగా పరిగణించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు.
కాగా, మన్మీత్ బ్రిస్బేన్‌లోని సిక్కు వర్గానికి చెందినవారు. మన్మీత్ మంచి గాయకుడిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. మన్మీత్ మృతితో బ్రిస్బేన్‌లోని సిక్కు కమ్యూనిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.