యాప్నగరం

వైట్‌హౌస్ వద్ద ఒంటికి నిప్పంటించుకుని ఎన్నారై సజీవదహనం

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ సమీపంలో ప్రవాస భారతీయుడు స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (మే 29) మధ్యాహ్నం 12.25 గంటలకు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 31 May 2019, 12:52 pm
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ సమీపంలో ప్రవాస భారతీయుడు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (మే 29) మధ్యాహ్నం 12.25 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. అతడిని భారత్‌కు చెందిన అర్నవ్‌ గుప్తాగా పోలీసులు గుర్తించారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అర్నవ్‌ శరీరం పూర్తిగా కాలిపోయింది. అతడిని వైద్యం కోసం తరలించిగా, అక్కడ చికిత్స పొందుతూ ‌మృతి చెందాడు. దీనిపై అమెరికా పార్క్ పోలీసులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మృతుడు అర్నవ్ మేరీల్యాండ్‌లో నివసిస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన అర్నవ్ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu arnav-gupta


అయితే, ఇంటి నుంచి బయటకు వచ్చిన అర్నవ్‌ వైట్‌హౌస్ సమీపంలోని ఎలిప్స్‌ పార్క్‌కు వచ్చి, అందరూ చూస్తుండగానే తనను తాను సజీవదహనం చేసుకున్నాడు. దీంతో షాక్‌ తిన్న అక్కడున్నవారు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 90 శాతం వరకు కాలిపోవడంతో బుధవారం సాయంత్రం అతడు హాస్పిటల్‌లో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆర్నవ్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. దీనిపై ఎలిప్స్ పార్క్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, రెండు నెలల వ్యవధిలో శ్వేతసౌధం వద్ద ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వచ్చిన ఓ వ్యక్తి శ్వేతసౌధం ఫెన్సింగ్ సమీపంలో తనకు తాను నిప్పంటించకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా కాలిపోయిన అతడిని వైద్యం కోసం తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.