యాప్నగరం

సిడ్నీలో తెలంగాణ టెక్కీ మృతి

ఇన్ఫోసిస్‌లో పనిచేస్తోన్న తెలంగాణ వాసి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మృతి చెందాడు. ఆరు నెలల కిందట ప్రాజెక్ట్ పనిపై ఆస్ట్రేలియా వెళ్లిన అతడు రెండు రోజుల కిందట ప్రాణాలు విడిచాడు.

TNN 26 Dec 2017, 11:50 am
తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసవీనగర్‌కు చెందిన కె.ఆదినారాయణరెడ్డి ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇన్ఫోసిస్ సంస్థ ఓ ప్రాజెక్ట్ పనిమీద ఆదినారాయణ రెడ్డిని ఆరు నెలల కిందట ఆస్ట్రేలియాకు పంపింది. ఆదినారాయణ రెడ్డి తన భార్య వసంత, మూడేళ్ల వయసున్న కవల పిల్లలిద్దరితో సహా సిడ్నీ వెళ్లారు. డిసెంబర్ 24 న తనకు జర్వంగా ఉందని భార్య వసంతకు చెబితే ఆసుపత్రికి వెళదామని అన్నాడు... ప్రస్తుతం టాబ్లెట్లు వాడుతున్నానని, తగ్గకపోతే వెళదామని ఆదినారాయణరెడ్డి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Samayam Telugu infosys techie from telanganas nalgonda district dies in sydney
సిడ్నీలో తెలంగాణ టెక్కీ మృతి


కొద్దిసేపటి తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి భార్య పిలవగా అతడి నుంచి సమాధానం రాకపోవడంతో భర్త అనారోగ్యం గురించి మెల్‌బోర్న్‌లోని తమ బంధువులకు విషయం చెప్పాలని వసంత ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ విషయం వారికి తెలిసి ఇంటికి వచ్చేసరికి ఆదినారాయణ రెడ్డి మరణించాడు. తన కొడుకు మృతదేహాన్ని మిర్యాలగూడకు తీసుకొచ్చేందుకు సహకరించాలని ఆదినారాయణ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదినారాయణరెడ్డి మృతికి గల కారణాలు తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి విన్నవించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.