యాప్నగరం

శ్రీనివాస్ హత్యకు ట్రంప్ పాలసీలతో నో లింక్

అమెరికా నూతన అధ్యక్షుడు వలసలపై తీసుకుంటున్న విధానాలే తెలుగుయువకుడు, ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు కారణమని వస్తున్న

Samayam Telugu 25 Feb 2017, 12:34 pm
అమెరికా నూతన అధ్యక్షుడు వలసలపై తీసుకుంటున్న విధానాలే తెలుగుయువకుడు, ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు కారణమని వస్తున్న విమర్శలను శ్వేతసౌధం (వైట్ హౌజ్) ఖండించింది.
Samayam Telugu no link between indian killing and trump policies white house
శ్రీనివాస్ హత్యకు ట్రంప్ పాలసీలతో నో లింక్


బుధవారం కేన్సస్ పట్టణంలోని ఓ బార్ లో అడమ్ ప్యూరింటన్ అనే అమెరికా శ్వేత జాతీయుడు ‘మా దేశం విడిచివెళ్లండి’ అంటూ తెలుగు యువకులు శ్రీనివాస్, అలోక్ లపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ మరణించగా, అలోక్ గాయపడ్డాడు. వీరిని రక్షించేందుకు ఓ అమెరికన్ కూడా గాయపడ్డ సంగతి తెలిసిందే.

దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వలసదారులపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే శ్వేతజాతీయులు రెచ్చిపోతున్నారని, ఫలితంగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలను శ్వేత సౌధం ఖండించింది.

‘‘ఎవరి ప్రాణాలు పోయినా అది పూడ్చుకోలేనిది. కానీ ట్రంప్ వలసలపై తీసుకుంటున్న విధానాల వల్లే ఈ హత్యలు జరుగుతున్నాయని లింకు చేసి మాట్లాడటం సరైంది కాదు. ఇది పూర్తిగా అసంబద్ధం’’ అని వైట్ హౌజ్ అధికార ప్రతినిధి సియన్ స్పైసర్ అన్నారు.

శ్రీనివాస్ హత్య వెనుక అసలైన కారణాలు కనుక్కోవాల్సి ఉందని చెప్పిన స్పైసర్..అప్పుడే ఓ అంచనాకు రావడం కరెక్టు కాదని అన్నారు.

కాగా, శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరపాలని భారత రాయబార కార్యాలయం అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.