యాప్నగరం

కాలిఫోర్నియాలో రైలు ఢీకొని తెలంగాణ వ్యక్తి మృతి

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన కృష్ణ ఎర్రవెల్లి(43).. అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందారు. సాంటా క్లారా సీఏలో డిసెంబర్ 14న లైట్ ట్రైన్ ఢీకొనడంతో ఆయన కన్నుమూశారు.

TNN 17 Dec 2017, 3:38 pm
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన కృష్ణ ఎర్రవెల్లి(43).. అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందారు. సాంటా క్లారా సీఏలో డిసెంబర్ 14న లైట్ ట్రైన్ ఢీకొనడంతో ఆయన కన్నుమూశారు. ఓహియో రాష్ట్రంలోని అల్బెనీ సిటీలో నివాసముంటున్న కృష్ణ.. ఉద్యోగ రీత్యా మూడు వారాల క్రితం సాన్ జోస్‌కు వచ్చారు. అక్కడ ప్రమాదవశాత్తు రైలు ఢీకొని కన్నుమూశారు. కృష్ణకు భార్య పూర్ణిమ, కుమార్తెలు శ్రీమయి, శ్రేష్ఠ ఉన్నారు. కృష్ణ మృతి చెందిన విషయం స్వస్థలంలోని కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Samayam Telugu telangana man dies after being hit by light train in california
కాలిఫోర్నియాలో రైలు ఢీకొని తెలంగాణ వ్యక్తి మృతి


కృష్ణ మృతదేహాన్ని స్వస్థలానికి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణ అంత్యక్రియలు, ఆయన కుటుంబాన్ని భారత్‌కు పంపడానికి సాన్ జోస్‌లోని తెలుగువారు విరాళాలు సేకరిస్తు్న్నారు. సోమవారం కృష్ణ భార్య, పిల్లలను భారత్ పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.