యాప్నగరం

అమెరికాలో కాల్పులు... తెలంగాణ వ్యక్తి దుర్మరణం

తెలంగాణలో దుండగుల కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. యాదాద్రి జిల్లాకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిని దుండగులు కాల్చి చంపారు. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పని చేస్తుండగా.. అతడిపై కాల్పులు జరిపారు.

Samayam Telugu 20 Feb 2019, 10:06 pm
అమెరికాలో తుపాకీ కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. తెలంగాణకు చెందిన గోవర్ధన్ రెడ్డి ఫ్లోరిడాలో దుండగులు కాల్చి చంపారు. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తోన్న కొత్త గోవర్ధన్ రెడ్డితోపాటు మరో వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. గోవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు అతడి కుటుంబీకులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు‌ మండలం రహీంఖాన్ పేటకు చెందిన గోవర్ధన్ ఏడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు.
Samayam Telugu shot dead


గత ఏడాది నవంబర్లో అమెరికాలోని న్యూజెర్సీ తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. మెదక్‌కు చెందిన సునీల్‌ ఎడ్లాను వెంట్నార్‌ సిటీలో ఆయన ఇంటి ముందే 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఆఫీస్ నుంచి ఇంటి వచ్చిన సునీల్‌పై కాపుగాసి మరీ ఆ బాలుడు కాల్పులు జరిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.