యాప్నగరం

లండన్‌లో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

గతేడాదే పెళ్లి చేసుకుని లండన్ వెళ్లిన ఓ నవ వధువు అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా...

TNN 6 Oct 2017, 6:41 pm
గతేడాదే పెళ్లి చేసుకుని లండన్ వెళ్లిన ఓ నవ వధువు అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వరంగల్ రెడ్డి కాలనీకి చెందిన తిరుమలగిరి స్వాతి (26)కి హన్మకొండ మచిలీబజార్‌కు చెందిన విజయ-శ్రీనివాస్ దంపతుల కొడుకు శ్రీపతి రాజేశ్‌ గతేడాది నవంబర్ 4న వివాహమైంది. పెళ్లి సమయంలోనే రూ.20 లక్షలు నగదు, 5 తులాల బంగారం, 2 కేజీల వెండితోపాటు రూ.1.50 లక్షల విలువైన ఇతర లాంఛనాలని కానుకగా ఇచ్చారు. పెళ్లి తర్వాత శ్రీపతి రాజేశ్ స్వాతిని తీసుకుని లండన్ వెళ్లిపోయాడు.
Samayam Telugu telangana woman dies under suspicious circumstances in london
లండన్‌లో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి


లండన్‌లో తమ కూతురు సుఖంగా ఉందనుకుంటున్న స్వాతి తల్లిదండ్రులకి అక్టోబర్ 2న ఓ పిడుగులాంటి వార్త తెలిసింది. తన భర్త, అత్తింటివారు అదనపు కట్నం తీసుకురమ్మని తనని వేధిస్తున్నారు అని ఇండియాలోని తల్లిదండ్రులకి ఫోన్ చేసి బోరుమంది స్వాతి. అప్పటికే పూర్తిగా ఆందోళనలో మునిగిపోయిన స్వాతి తల్లిదండ్రులకి ఆ మరునాడే ఫోన్ చేసిన స్వాతి భర్త శ్రీపతి రాజేష్.. మీ కూతురు స్వాతి కనిపించడం లేదని చెప్పాడు. జరగకూడనిది ఏదో జరుగుతోందని ఆందోళన చెందుతున్న స్వాతి తల్లిదండ్రులకి అక్టోబర్ 4న ఫోన్ చేసిన శ్రీపతి రాజేష్... స్వాతి మృతదేహం సముద్రంలో దొరికిందని, ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పాడు.

తమ కూతురు స్వాతిని శ్రీపతి రాజేష్, అతడి తల్లిదండ్రులు, ఆడపడుచే చంపి సముద్రంలో పడేసి ఆత్మహత్యగా కట్టు కథ అల్లుతున్నారని స్వాతి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. స్వాతి మృతి వార్త తెలుసుకున్న ఆమె బంధువుల పెద్ద సంఖ్యలో హన్మకొండలోని రాజేశ్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. శ్రీపతి రాజేష్, అతడి తల్లిదండ్రులు, స్వాతి ఆడపడుచుని అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతు స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.