యాప్నగరం

భారత సంతతి బాలికకు శాంతి బహుమతి

భారత సంతతికి చెందిన 16 ఏళ్ల బాలికకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి లభించింది.

TNN 3 Dec 2016, 7:47 pm
భారత సంతతికి చెందిన 16 ఏళ్ల బాలికకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి పనిచేస్తున్న భారత సంతతి పర్యావరణ కార్యకర్త కెహ్కషాన్ బసు.. వాతావరణ న్యాయం, పర్యావరణ క్షీణతపై పోరాడుతోంది. ఈ మేరకు నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ చేతుల మీదుగా బసు ఈ బాలల శాంతి బహుమతిని అందుకుంది.
Samayam Telugu uae based indian girl kehkashan basu wins international childrens peace prize
భారత సంతతి బాలికకు శాంతి బహుమతి


ఏటా మూడు మిలియన్ల పిల్లలను పొట్టనబెట్టుకుంటున్న పర్యావరణ సమస్యలపై ఒక బాలిక పోరాటం చేయడం ఎంతో గొప్ప విషయమని యూనస్ కొనియాడారు. పర్యావణాన్ని కాపడటానికి, మంచి భవిష్యత్తును చూడటానికి పిల్లల్ని, పెద్దల్ని చైతన్య పరిచేలా తన ప్రచారాన్ని కొనసాగిస్తానని బహుమతి అందుకున్న తరవాత కెహ్కషాన్ బసు వెల్లడించింది.

కెహ్కషాన్ ఎనిమిదేళ్ల వయసులోనే పర్యావరణంపై ప్రచారాన్ని మొదలుపెట్టింది. తన ఇరుగుపొరుగు వారికి ప్రధాన్యత, దాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాలపై చైతన్యం కలిగించేది. ఆమె 12 ఏట ‘గ్రీన్ హోప్’ పేరిట ఒక సంస్థను నెలకొల్పింది. దీని ద్వారా లెక్కలేనన్ని పర్యావరణ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. కాగా, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో పాలుపంచుకున్న గ్లోబర్ కోఆర్డినేటర్లలో కెహ్కషాన్ అతిపిన్న వయస్కురాలు కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.