యాప్నగరం

ఆస్ట్రేలియాలో విశాఖ యువకుడి మృతి

ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ మరణించాడు.

TNN 15 Dec 2016, 3:24 pm
ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ మరణించాడు. విశాఖపట్నంలోని మురళీనగర్‌కు చెందిన అనుదీప్ మెల్ బోర్న్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. కాగా బుధవారం సాయంత్రం నలుగురు స్నేహితులతో కలిసి స్మిమ్మింగ్ పూల్ ఈత కొట్టాడు. అందులోనే ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. అనుదీప్ మరణించిన విషయం గురువారం ఉదయం తల్లిదండ్రులకు తెలిసింది. ఒక్కగానొక్క కొడుకు అందరానిలోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొడుకు మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం సహకరించాలని వారు కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.