యాప్నగరం

13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభించాడు

తొమ్మిదేళ్ల వయసులో తొలి మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించిన భారత సంతతి బాలుడు ప్రస్తుతం మరో సంచలనానికి తెరతీశాడు.

Samayam Telugu 17 Dec 2018, 4:05 pm
భారత సంతతికి చెందిన తన్మయ్ భక్షి అతిపిన్న వయసులో యాప్స్ రూపొందించడంతో పాటు ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్‌ను వాడి ఔరా అనిపించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలుడు దుబాయ్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. భారత సంతతికి చెందిన ఆదిత్యన్ రాజేష్ 13 ఏళ్లకే సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించాడు. తన వయసు పిల్లలు ఏ ఆటలు ఆడాలో ఆలోచిస్తుంటారు కానీ కేరళకు చెందిన ఈ బాలుడు 9 ఏళ్ల వయసులో తొలి మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించడం విశేషం.
Samayam Telugu Adithyan Rajesh


ఆదిత్యన్ రాజేష్ స్థానిక ఖలీజ్ టైమ్స్‌తో మాట్లాడాడు. 'నేను కేరళలోని తిరువిల్లాలో పుట్టాను. నాకు 5 ఏళ్లు ఉన్నప్పుడు మా ఫ్యామిలీ దుబాయ్‌కి వలస వచ్చింది. అదే సమయంలో బీబీసీ టైపింగ్ అనే వెబ్‌సైట్‌ను మా నాన్న నాకు చూపించారు. ఇది చిన్నారులు టైపింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడే వెబ్‌సైట్. కంపెనీ స్థాపించాలంటే యజమాని వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. అయితే అంత వయసు లేకున్నా ముగ్గురు స్నేహితులతో కలిసి కంపెనీని స్టార్ట్ చేశాను. ఇప్పటికే 12 మంది క్లయింట్స్ ఉన్నారు. అయితే ప్రస్తుతం డిజైనింగ్, కోడింగ్ సేవల్ని వారికి ఉచితంగా అందిస్తున్నామని’ వివరించాడు.

ట్రైనెట్ సొల్యూషన్స్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించిన ఆదిత్యన్‌కు చిన్నప్పటి నుంచీ టెక్నాలజీ అంటే అమితాసక్తి. దాంతో కంపెనీల లోగోలు, వెబ్‌సైట్స్ క్రియేట్ చేసే ఆదిత్యన్ తొమ్మిదేళ్ల వయసులో తొలి మొబైల్ అప్లికేషన్ రూపొందించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బెడ్రూమ్‌లో ఓ అలవాటుగా ప్రయత్నించి యాప్ తయారుచేశానన్న బాలుడు.. భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
Read this Article in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.