యాప్నగరం

తెలుగు రాష్ట్రాలపై విష మేఘాలు.. ‘గ్రీన్‌పీస్’ అలర్ట్!

తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకుంటున్న ఈ విష మేఘాలు ఊపిరి తీసేంత ప్రమాదకరమైనవి. ప్రపంచ పర్యావరణాన్ని పర్యవేక్షించే ‘గ్రీన్‌పీస్’ సంస్థ సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Samayam Telugu 30 Oct 2018, 4:35 pm
తెలుగు రాష్ట్రాలను కాలుష్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు గాల్లో ప్రమాదకర ఎన్‌వో2 (NO2) ఉద్గారాలు వెదజల్లుతున్నాయి. ఫలితంగా తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రామగుండం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ ప్రపంచ కాలుష్య కేంద్రాల జాబితాలో చేరాయి.
Samayam Telugu Untitled11


యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సెంటినల్ 5పీ ఉపగ్రహం ఈ ఏడాది జూన్, ఆగస్టు నెలల్లో దేశంలోని పర్యావరణ పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా దేశంలోని పలు నగరాల్లో అత్యంత ప్రమాదకరమైన ఎన్‌వో2 ఉద్గారాలు ఉన్నట్లు గుర్తించింది. బొగ్గును మండించడం వల్ల, వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల గాల్లో ఎన్‌వో2 ఉద్గారాలు చేరుతున్నట్లు పేర్కొంది.

‘గ్రీన్‌పీస్’ సంస్థ సేకరించిన ఈ సమాచారం ప్రకారం.. రామగుండంలో ఉన్న థర్మల్ ప్లాంట్ వల్ల ఆ నగరంలో ఎన్‌వో2 ఎక్కువగా ఉన్నాయి. అలాగే, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో వాహనాల నుంచి వచ్చే పొగ, పరిశ్రమలు ఉత్పత్తి చేసే కాలుష్యం వల్ల విష మేఘాలు కమ్ముకుంటున్నాయని గ్రీన్‌పీస్ పేర్కొంది. ప్రపంచంలోని 50 కాలుష్య కేంద్రాల్లో ఢిల్లీ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయని తెలిపింది. ఎన్‌వో2 అంటే నైట్రోజన్ డై ఆక్సైడ్.. ఇది గాల్లో ఎక్కువగా ఉంటే ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. లేకపోతే, భవిష్యత్తులో మాస్కులు పెట్టుకుని తిరిగే పరిస్థితి నెలకొంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.