యాప్నగరం

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సి 40

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సి40 రాకెట్‌ దూసుకుపోయింది.

TNN 12 Jan 2018, 9:52 am
Samayam Telugu isro has successfully launched its 100th satellite cartosat 2 series
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సి 40
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సి40 రాకెట్‌ దూసుకుపోయింది. పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ ద్వారా మూడు స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో కలిపి 31 ఉగ్రహాలను కక్ష్యలోకి పంపింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. తాజా ప్రయోగంతో భారత్‌కు చెందిన మొత్తం వంద ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లవుతుంది. 2018లో ఇదే మొదటి ప్రయోగం, గత ఆగస్టులో ఇస్రో చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతేడాది ఆగస్టు 31 న పీఎస్‌ఎల్‌వీ-సి 39 ప్రయోగం విఫలమవడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టును భారతీయ శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకున్నారు. నాటి ప్రయోగంలో రాకెట్లో ఉష్ణకవచం తెరుచుకోకపోవడంతో విఫలమైనట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు, తర్వాత నాలుగు నెలల పాటు ఎలాంటి ప్రయోగం నిర్వహించలేదు.

గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన భారత్ ఈ విజయంతో అమెరికా, రష్యాల సరసన చేరింది. గతంలో అమెరికా 29, రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను సైతం భారత్‌ బద్దలు కొట్టడమే కాకుండా భవిష్యత్తులో ఎవరూ అందుకోని ఎత్తునకు ఎదిగింది. ఈసారి మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగిస్తుండగా, వాటిలో 28 విదేశాలకు చెందినవే కావడం గమనార్హం. ప్రధానంగా ‘కార్టోశాట్‌-2’ సిరీస్‌లోని కీలకమైన ఉపగ్రహం భారత్‌కు చెందినది. ఈ ప్రయోగంలో స్వదేశీ పరిఙ్ఞ‌ానంతో రూపొందించిన 100వ ఉపగ్రహం ఉండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.