యాప్నగరం

కేన్సర్‌పై పరిశోధనలు.. జేమ్స్ అల్లిసన్, హోంజో‌లకు నోబెల్ బహుమతి

కేన్సర్ చికిత్సలో చెక్ పాయింట్ థెరపీని కనుగొన్నజేమ్స్ పి. అల్లిసన్, తసుకు హోంజో‌కు ఈ ఏడాది మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు.

Samayam Telugu 1 Oct 2018, 3:40 pm
ఈ ఏడాది మెడిసిన్ విభాగంలో జేమ్స్ పి. అల్లిసన్, తసుకు హోంజో‌కు సంయుక్తంగా నోబెల్ బహుమతి లభించింది. కేన్సర్ చికిత్సలో చెక్ పాయింట్ థెరపీని కనుగొన్నందుకు నోబెల్ అసెంబ్లీ ఆఫ్ ది కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరికి పది లక్షల డాలర్ల నగదు బహుమతిని అందజేయనున్నారు. జపాన్‌కు చెందిన తసుకు హోంజో కేన్సర్ ఇమ్యునోథెరపీపై పరిశోధనలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన జేమ్స్ పి. అల్లిసన్ ఎం.డి. అండర్సన్ కేన్సర్ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా, ఇమ్యునాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. ఇమ్యునోథెరపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు.
Samayam Telugu nobel medicine


ఏటా మెడిసిన్ విభాగంలో తొలి నోబెల్ ప్రైజ్‌ను ప్రకటిస్తారు. డైనమెట్‌కు రూపకల్పన చేసిన అల్ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. మంగళవారం ఫిజిక్స్‌లో, బుధవారం కెమిస్ట్రీలో నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి ప్రకటిస్తారు. మంగళవారం స్వీడన్‌లో ఆర్థిక శాస్త్రం నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తారు.

ఈ ఏడాది సాహిత్యం విభాగంలో నోబెల్ బహుమతిని అందజేయడం లేదు. అవార్డింగ్ బాడీకి లైంగిక ఆరోపణల్లో చిక్కుకోవడమే ఇందుకు కారణం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.