యాప్నగరం

క్యాన్సర్‌తో పోరాడే మటన్.. హైదరాబాద్ శాస్త్రవేత్తల పరిశోధన

క్యాన్సర్ ఎంత భయంకరమైన వ్యాదో అందరికీ తెలిసిందే. తొలి దశలోనే ఈ వ్యాధిని గుర్తించకపోతే ప్రాణానికే ప్రమాదం. అలాంటి మహమ్మారితో పోరాటానికి హైదరాబాద్ శాస్త్రవేత్తలు మాంసాన్నే మందుగా ఎంచుకున్నారు.

TNN 20 Dec 2017, 4:02 pm
క్యాన్సర్ ఎంత భయంకరమైన వ్యాదో అందరికీ తెలిసిందే. తొలి దశలోనే ఈ వ్యాధిని గుర్తించకపోతే ప్రాణానికే ప్రమాదం. అలాంటి మహమ్మారితో పోరాటానికి హైదరాబాద్ శాస్త్రవేత్తలు మాంసాన్నే మందుగా ఎంచుకున్నారు. రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్‌తో పోరాడే మటన్‌ను హైదరాబాద్‌లోని జాతీయ పరిశోధన కేంద్రం(ఎన్‌ఆర్‌సీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుత ఈ పరిశోధన చివరి దశలో ఉంది. గొర్రెకు పోషకాహారాన్ని అందించడం ద్వారా దాని మాంసంలో సెలీనియంను సమృద్ధిగా ఉత్పత్తయ్యేలా చేస్తున్నారు. సెలీనియంకు క్యాన్సర్‌తో పోరాడే గుణం ఉంది.
Samayam Telugu magic meat hyderabad scientists inch closer to developing mutton that can fight cancer
క్యాన్సర్‌తో పోరాడే మటన్.. హైదరాబాద్ శాస్త్రవేత్తల పరిశోధన


‘గొర్రెకు అందించే మేతను మార్చడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించే మటన్‌ను మేము తయారుచేస్తున్నాం. పౌష్టికాహారాన్ని బాగా అందిస్తే గొర్రె మాంసంలో సెలీనియం బాగా చేరుతుంది. అయితే ఇది టాక్సిక్ స్థాయికి చేరకుండా ఉండేందుకు పరిశోధనపై ఎక్కువ దృష్టి సారించాం’ అని ఎన్ఆర్‌సీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి.బస్వరెడ్డి టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. సెలీనియంను తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే గొర్రె మాంసంలో సెలీనియం ఉత్పత్తయ్యేలా.. అది కూడా తగిన మోతాదులో ఉండేలా పరిశోధనలు చేస్తున్నారు.

వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పరిశోధన పూర్తవుతుందని ఎన్‌ఆర్‌సీ (మాంసం) డైరెక్టర్ డాక్టర్ ఎస్.వైతియనాథన్ టైమ్స్ ఇండియాకు వెల్లడించారు. గొర్రెలపై పరిశోధన చేస్తు్న్న శాస్త్రవేత్తలు ఫలితం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎన్ఆర్‌సీ వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.50.44 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో పరిశోధనకు అవసరమైన వాటిని కొనుగోలు చేశారు. అలాగే పరిశోధన కోసం మార్కెట్ నుంచి గొర్రెలను కొంటున్నారు.

సెలీనియం పనిచేస్తుందిలా..
సెలీనియం అనేది శక్తివంతమైన న్యూట్రిషనల్ యాంటాక్సిడెంట్ అని అల్వాల్‌లోని జూబ్లీ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ ఇ. గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇది శరీరానికి అవసరమైన మినరల్స్‌ను అందిస్తుందని తెలిపారు. తగిన మోతాదులో సెలీనియంను తీసుకుంటే వివిధ రకాల క్యాన్సర్‌ నుంచి ఉపసమనం ఉంటుందన్నారు. ఈ విషయం ఇప్పటికే అనేక వైద్య పరిశోధనల్లో రుజువైందని చెప్పారు. ‘న్యూరోట్రాన్స్‌మిట్టర్స్’ అనే బ్రెయిన్ కెమికల్స్ ఉత్పత్తిలో మినరల్స్ కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. అయితే సెలీనియం మోతాదు ఎక్కువైతే మనిషులకు అది హాని చేస్తుందని కొన్ని పరిశోధనలు తేల్చినట్లు ఆయన వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.