యాప్నగరం

మారుతీ సుజుకి తొలి ఎలక్ట్రిక్ కార్

భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కార్ నమూనా ‘ఇ-సర్వైవర్’ను ప్రదర్శించనుంది.

Samayam Telugu 24 Jan 2018, 5:55 pm
భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కార్ నమూనా ‘ఇ-సర్వైవర్’ను ప్రదర్శించనుంది. వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో ఈ ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించనున్నట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం జీవితచక్రం అభివృద్ధకి సహకరించడంలో మారుతీ సుజుకి ఎంత కట్టుబడి ఉందో దీని ద్వారా తెలుస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ నిర్ణయం స్థానిక విడిభాగాల తయారీదారులు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీల రీసైక్లింగ్ వంటి వాటికి ఊతమిస్తుందని పేర్కొంది.
Samayam Telugu maruti suzuki to showcase first electric car e survivor at auto expo
మారుతీ సుజుకి తొలి ఎలక్ట్రిక్ కార్


కాగా, ఇ-సర్వైవర్ ఓపెన్ టాప్, టూ సీటర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ). 2030 నాటికి దేశంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే విక్రయించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీని కోసం కార్ల తయారీ సంస్థలను తాము కోరమని ఇప్పటికే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అంటే కార్ల తయారీ సంస్థలు తమంతట తామే ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నట్లు మారుతీ సుజుకి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా నుంచి సుజుకి ఎలక్ట్రిక్ టెక్నాలజీని తీసుకుంటున్నట్లు సమాచారం. సుజుకి-టొయోటా భాగస్వామ్యంతోనే ఎలక్ట్రిక్ కార్లను తయారుచేస్లున్నారట. ‘మారుతీ వద్ద ఈ-వెహికల్స్ టెక్నాలజీ లేదు. ఇది నిజం’ అని మారుతీ సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించడం.. టొయోటోతో సుజుకి భాగస్వామ్యం వాదరను బలం చేకూరుస్తోంది. ఇదిలా ఉంటే ‘ఫ్యూచర్-ఎస్’ అనే కాన్సెప్ట్ కారును కూడా మారుతీ సుజుకి ప్రదర్శించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.