యాప్నగరం

జియో 112 జీబీ డేటా ఫ్రీ.. ఇలా చేస్తే సరి!

రిలయన్స్ జియో తన కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీతో 112 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఫ్రీ డేటా కోసం ఇలా చేస్తే సరి.

Samayam Telugu 25 Apr 2018, 1:57 pm
రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి భారత టెలీకాం మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. జియో దెబ్బకు మిగతా టెలీకాం కంపెనీలు కూడా ధరలు తగ్గించక తప్పలేదు. ఇప్పుడు జియో మరోసారి డేటాగిరీతో ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టిస్తోంది. తన కస్టమర్లకు 112 జీబీ ఉచిత డేటాను అందిస్తున్నట్లు జియో చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. జియోఫోన్ మ్యాచ్ పాస్ కింద ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వీలుగా ఈ ఆఫర్‌ను రిలయన్స్ ప్రకటించింది.
Samayam Telugu jio offer


56 రోజుల వ్యాలిడిటీతో జియో 112 జీబీ డేటాను పూర్తి ఉచితంగా అందిస్తోంది. దీని కోసం కస్టమర్లు పది మంది ఫ్రెండ్స్‌కు జియోఫోన్ ఇప్పించాల్సి ఉంటుంది. ఎంత మందికి చేశామనేదాన్ని బట్టి మీ ఫోన్లో డేటా క్రెడిట్ అవుతుంది. ఎక్కువ మంది ఫ్రెండ్స్‌కు జియోఫోన్ ఇప్పించిన ఇద్దరు కస్టమర్లకు ప్రతివారం జియో ధన్ ధనా ధన్ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

జియోఫోన్ మ్యాచ్ పాస్ కోసం ఏం చేయాలంటే..?

స్టెప్-1: జియోఫోన్ తీసుకోవాలని ఆసక్తిగా ఉన్న మీ ఫ్రెండ్స్‌కు టోల్ ఫ్రీ నంబర్ 1800-890-8900ను అందించాలి.

స్టెప్-2: మీ ఫ్రెండ్స్ ఆ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మీ జియో నంబర్, పిన్ కోడ్, వారి లొకేషన్ ఎంటర్ చేయాలి.

స్టెప్-3: మీ ఫ్రెండ్స్ దగ్గర్లోని జియో రిటైలర్ దగ్గరకెళ్లి లేదా ఆన్‌లైన్ ద్వారా జియోఫోన్ పొందొచ్చు.

స్టెప్-4: ఆఫర్ మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ అకౌంట్లోనూ క్రెడిట్ అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.