యాప్నగరం

ఆటో బోల్తా, టెన్త్ విద్యార్ధులకు గాయాలు

కృష్ణాజిల్లా : పెనుగంచిప్రోలు మండలం శనగపాడులో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది.

TNN 29 Mar 2016, 5:44 pm
కృష్ణాజిల్లా : పెనుగంచిప్రోలు మండలం శనగపాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడి 10 మంది విద్యార్ధులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 వాహనానికి సమాచారమిచ్చి సమీపంలో ఉన్న నందిగామా ఆస్పత్రికి తరలించారు. టెన్త్ పరీక్షలు రాసి తిరిగి ఆటో లో వస్తుండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ గా వచ్చిన ఆటో శనగపాడు వద్ద రోడ్డు పక్కన ఉన్న బండ రాయిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గాయపడ్డ వారిలో ఇద్దరు విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.